04 November 2013

శ్రీవారి నిజరూపదర్శనం గురించి మీకు తెలుసా ?

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలూ లేకుండా దర్శనమిస్తారు. నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు.

దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టుధోవతిని ధరింపజేస్తారు. కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు.


గురువారం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానిక్కూడా సిబ్బంది భయపడతారు. ఎందుకంటే పాప కార్యాలు చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం. గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు.

No comments:

Post a Comment