31 October 2013


శివాభిషేక ఫలములు :

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
ఆలయ దర్శనం :

దైవదర్శనానికి వెళ్లే సమయంలో మనం ధరించిన దుస్తులతో పాటు శరీరమూ, మనస్సూ కూడా పరిశుభ్రంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. నుదుటన చక్కగా విభూతి లేదా కుంకుమ ధరించాలి. అలాగే, ఆలయప్రవేశం చేసేముందు తప్పనిసరిగా కాళ్లూ, చేతులూ కడుక్కునే లోపలికి వెళ్లాలి.

మనతో ఎవరైనా వస్తుంటే వారితో గట్టిగా మాట్లాడు కుంటూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయానికి వస్తున్నామంటే మన మనస్సంతా ఆ దైవంమీదనేలగ్నం చెయ్యాలి. మనసులో ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఆలయానికి వెళ్లాలి. లేదా ఏ దేవతను సందర్శించేందుకు వెడుతున్నామో ఆ దేవత నామాన్ని స్మరిస్తూ లోపలికి వెళ్లాలి.


ఆలయంలోకి ప్రవేశింపచేసే రాజగోపుర ద్వారాన్ని దర్శించి రెండుచేతులూ జోడించి స్వామి దర్శనం తనివి తీరా చేయించమని గోపురాన్ని వేడుకోవాలి. లోపలికి వెళ్లగానే ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉండే నిలు వెత్తు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభమంటే నిజమైన భక్తునికి నిదర్శనం. ఎప్పుడూ స్వామి సన్నిధిలో నిశ్చలమైన ధ్యానముద్రలో ఉండే ఈ స్తంభానిదే అసలు పుణ్యమంతా. అందుకే చాలా పవిత్రంగా ఈ స్తంభానికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసినా ఉత్తమ ఫలితం వస్తుంది.


అనంతరం బలిపీఠా (సాధారణంగా అమ్మవారి, శివాలయాల్లో ఇది ఉంటుంది)న్ని సందర్శించి మనలో పేరుకున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను బలి చేస్తున్నట్టు భావించి, వీటి స్థానంలో ప్రేమ, త్యాగం, దాతృత్వంఇత్యాది గుణాలను అలవడేలా చెయ్యమని ప్రార్థించుకోవాలి.


అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసుకుని అనంతరం ఆలయంలోని తొలిపూజల వేల్పు గణనాథుణ్నిదర్శించి మొక్కాలి. ఈ స్వామికి గుంజీళ్లంటే ఇష్టం. 'దండాలయ్యా ఉండ్రాలయ్యా' అంటూ భక్తితో మూడునుంచీ అయిదుకు మించకుండా శక్తిమేరకు గుంజీళ్లు తీసి స్వామి అనుగ్రహాన్ని అర్థించాలి. భక్తితో నమస్కరిస్తే చాలు పరవశించి వరాలననుగ్రహిస్తాడీ కరి ముఖ వరదుడు.


అనంతరం ఆలయ ప్రధాన మూల విరాట్టును దర్శించే ముందు ఇంకా ఈ ఆలయంలో ఇతర దేవతా మూర్తులు కొలువై ఉంటే వారిని దర్శించుకోవాలి. ఉపాలయాల్లోని ఆ మూర్తులను దర్శినంచిన అనంతరం ప్రధాన మూర్తి దర్శనానికి రావాలి. వైష్ణ్వాలయమైతే ఈ స్వామి గర్భాలయానికి ఎదురుగా వుండే గరుడాళ్వారునూ, గర్భగుడి సింహ ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకులనూ సేవించుకుని, స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించమని వారిని కోరుకుని స్వామివారి కంటే ముందుగా వారి దేవేరి అయిన అలమేలు మంగమ్మను, శివాలయంలోనైతే పార్వతీదేవిని దర్శించాలి. ఆ తరువాత ప్రశాంత చిత్తంతో ప్రధానమూలవిరాట్టు అనుగ్రహం కోసం ప్రార్థించుకుంటూ ఆయన్ను దర్శించాలి.


స్వామిని దర్శించే సమయంలో ఒక్క క్షణాన్ని వృథా పోనీయకుండా తనివితీరా దర్శించాలి. అంతేకానీ, కళ్లు మూసుకుని ప్రార్థించకూడదు. (అయితే, ఇక్కడో విషయం ఉంది. నిజమైన భక్తులకు ఆ భక్తిపారవశ్యంలో కళ్లు మూసుకున్నా కూడా ఆయనమూర్తి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి భక్తులకిది మినహాయింపే మరి!) స్వామిని ఆపాద మస్తకం దర్శించాలి. అంటే- ముందుగా పాదాలనే చూడాలి. ఆ చరణాలే మనకు శరణాన్ని ప్రసాదిస్తాయన్న మాట. తరువాత, అభయాన్ని ప్రసాదించే హస్తాలు, ఆపై, కరుణను చిలకరించే నేత్రాలు, చిరునవ్వు చిందించే వదనం, ఇలా స్వామిని తిలకించి పులకించాలి.


అమ్మవారినైతే ముందుగా దయను వర్షించే నేత్రాలను, సౌభాగ్యసిద్ధి కలిగించే మాంగల్యాన్ని, అభయాన్నందించే హస్తాలు, ఆపై ఆప్యాయతగా మనవద్దకు వచ్చే ఆ శ్రీ చరణాలనూ దర్శించాలి.కిందికి చూస్తూ, తల్లిని చూసే చిన్నపిల్లల్లా మనసంతా ఆమెనే నింపుకుంటూ దర్శించుకోవాలి.


తరువాత ఆలయంలో ఎక్కడైనా కాసేపు కూర్చుని ప్రశాంతంగా స్వామిని ప్రార్థించుకోవాలి. తరువాత, ద్వారపాలకులను మనసులోనే దర్శించుకుని, వారి అనుమతిని కోరుకుంటూ, బయలుదేరాలి.


తరువాత మళ్లీ ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసుకుని తిరిగి వెళ్లాలి.


శివాలయాల్లో మామూలుగా ధ్వజస్తంభం వద్దే నందీశ్వరుణ్ని ప్రతిష్ఠించి వుంటారు. ఇట్లాంటి చోట్ల నంది తోకను భక్తిశ్రద్ధలతో తాకి కళ్లకద్దుకోవాలి.


తరువాత నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి వంగి చూస్తూ, ఎదుట వున్న పరమేశ్వరుణ్ని దర్శించుకోవాలి. ఆ తరువాతే ఆలయప్రవేశం చేసి వినాయకుణ్ణి దర్శించుకోవాలి.


నందీశ్వరుడూ, ధ్వజస్తంభమూ లేని ఆలయాల్లో వినాయకుణ్ణి ముందుగా దర్శించుకుని, స్తుతించుకుంటూ ముందుకు పోవాలి.


శివాలయాల్లో చిట్టచివర దర్శించుకోవలసిన దైవం చండికేశ్వరుడు. ఆయన నిరంతరమూ ధ్యానంలో వుంటాడు కనుక, ఆయన ముందు నిలబడి, మెల్లగా మూడు సార్లు చప్పట్లు చరిచి, ఆయనను మేల్కొలిపి, దర్శించుకుని, దర్శనఫలాన్ని అనుగ్రహించమని వేడుకోవాలి.


ప్రదక్షిణలు చేయాల్సిన విధానం :


ప్రదక్షిణలను పెద్దలు చెప్పిన పద్ధతిలో చేయాలి. కుడి వైపును దక్షిణం అంటారు. 'ప్ర' అంటే ఆ వైపుగా అని అర్థం. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, ఏ దైవాన్ని ఉద్దేశిస్తున్నామో, ఆ దైవం వైపుగా మన కుడి భాగం వుండాలి. అంటే గడియారపు ముళ్లు తిరుగుతున్నట్లుగా తిరగాలి. ఏ దైవానికీ అప్రదక్షిణంగా తిరగకూడదు. అభిషేకాలు చేస్తున్న సమయంలో ప్రదక్షిణలు చేయకూడదు. మధ్యాహ్నసమయం తరువాత రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయకూడదు.


విఘ్నేశ్వరునికి ఒక ప్రదక్షిణ, శివలింగం, అమ్మవారు, దక్షిణామార్తి వంటి దైవాలకు ముమ్మారూ, శ్రీమహావిష్ణువుకూ, తాయారుకూ నాలుగు ప్రదక్షిణలూ చేయాలి. అలా తిరిగి వచ్చేటప్పుడు, బలిపీఠాన్ని కూడా కలుపుకుంటూ, దానికి బయటి వైపుగా రావాలి.


ఇట్లా చేసే ప్రదక్షిణలకూ తగిన ఫలాలున్నాయి. ఉదయం చేసే ప్రదక్షిణలు వ్యాధులను నివారిస్తాయి. మధ్యాహ్నప్రదక్షిణలు కోరికలు తీరుస్తాయి. సాయంకాలప్రదక్షిణలు పాపాలను హరిస్తాయి. రాత్రి చేసే ప్రదక్షిణలు మోక్షాన్ని అనుగ్రహిస్తాయి.


దైవానికి చేసే షోడశోపచారాల్లోనూ అత్యంతమూ ఉత్తమం దీపారాధన. ఈ దీపారాధన సమయాల్లో, ముక్కోటి దేవతలూ ఆ దీపాల్లోకి వేంచేసి, దైవదర్శనం చేసుకుంటారని ఐతిహ్యం వుంది.


దీపారాధన వైశిష్ట్యం :


భగవంతుడు జ్యోతిస్వరూపుడు. అందువల్ల, ఆయనకు దీపారాధన చేయటం వల్ల కష్టాలు నివృత్తి అవుతాయి. ముఖ్యంగా, ఆలయాల్లో ఉదయమూ, సాయంకాలం ప్రమిదెల్లో కాస్త నూనె పోసినా, వత్తులను పైకి ఎగదోసినా, ఐశ్వర్యవృద్ధి.


తొమ్మిది దీపాలు నవగ్రహాలనూ, ఏడు దీపాలు సప్తకన్యలనూ, ఐదు దీపాలు పంచకళలనూ, మూడు దీపాలు సూర్యచంద్రాగ్నులనూ, ఒక దీపం అఖిలాండేశ్వరి అయిన ఆదిపరాశక్తినీ సూచిస్తాయి. పూజల చివరలో చూపించే కుంభదీపం, ఈ ప్రపంచతత్వమైన, సదాశివతత్వాన్ని తెలుపుతుంది.


దీపాలను హారతి ఇస్తూ మూడుసార్లు దేవుని ముందు తిప్పుతారు. తొలి చుట్టు ఈ చరాచరజగత్తును కాపాడమనీ, రెండో చుట్టు జగత్తులోని సకలజీవరాసులనూ కాపాడమనీ, మూడో చుట్టు పంచభూతాలనూ రక్షించమనీ కోరుతూ తిప్పుతారు.


ఆలయాల్లోని పుష్కరిణుల్లో, సాక్షాత్తుగా గంగానదిలో స్నానం చేస్తున్నంత భక్తితో, దేవాలయగోపురాన్ని దర్శించుకుంటూ స్నానం చేయాలి. అక్కడ నూనె, సబ్బు, షాంపూలను వాడకుండా ముమ్మారు నీట మునిగి స్నానం చేయాలి. ఆ తరువాత తడిబట్టలు మార్చుకుని, పరిశుభ్రమైన వస్త్రాలతో ఆలయప్రవేశం చేయాలి.


వైష్ణవాలయాల్లో నవగ్రహాలుండవు. నారాయణుడు, తన చేతిలో వుండే సుదర్శనచక్రానికి నవగ్రహాలకు వున్న శక్తులనూ, అనుగ్రహాలనూ ప్రసాదించాడు. అందుకని శ్రీచక్రత్తాళ్వారును సందర్శించుకుంటే, నవగ్రహాలనూ దర్శించి ప్రార్థనలూ, పూజలూ చేసుకున్న ఫలాలు దక్కుతాయి.


వినాయకుని సన్నిధిలో కొబ్బరికాయను స్త్రీలు సమర్పించకూడదు. ముఖ్యంగా అక్కడ గర్భిణులు వుంటే, వారిని పక్కకు తొలగమని చెప్పాకే కొబ్బరి కాయ కొట్టాలి.


కొన్ని శివాలయాల్లో కాలభైరవస్వామి సన్నిధి వుంటుంది. పెరుగులో కలిపిన ఆవాలను ఆయనకు సమర్పిస్తూ, ''ఓం కాలభైరవాయ నమ:'' అంటూ ఆయనకు నమస్కరించాలి.


ప్రదోషసమయం - ప్రదక్షిణలు :


శుక్లపక్షంలోనూ, కృష్ణపక్షంలోనూ త్రయోదశి తిథి రోజున సూర్యుడు అస్తమించే ముందు అంటే 04.30 నుంచి 06.00 గంటల వరకూ వుండే సమయాన్ని 'ప్రదోషసమయం' అంటారు. మహాదేవుడు హాలాహలవిషాన్ని సేవించిన రోజు శనివారం. ఈ కారణం చేతనే, శనివారం వచ్చే ప్రదోషసమయానికి, 'శనిప్రదోషసమయం' అనే ప్రత్యేకత చేకూరుతుంది.


మామూలు రోజుల్లో కుడివైపు నుంచి ప్రదక్షిణలు చేస్తారు. కానీ, ఈ ప్రదోషసమయాల్లో మాత్రం కుడిఎడమలు రెండు వైపులా ప్రదక్షిణలు చేయాలి. క్షీరసాగరమథనసమయంలో, హాలాహలం పుట్టి, దేవతలను బెంబేలెత్తించగా, వారందరూ స్వామికి కుడిఎడమలుగా పరుగులు తీశారట. అందుచేతనే ప్రదోషసమయంలో స్వామికి కుడిఎడమలుగా ప్రదక్షిణలు చేసి సేవించుకోవాలి.


ప్రదోషసమయంలో ముందుగా నందిని దర్శించుకుని, ఆయన కొమ్ముల మధ్య నుండి శివలింగాన్నీ, ఆ తరువాత చండికేశ్వరుణ్నీ దర్శించుకుని, మళ్లీ వచ్చి నందినీ, మహాదేవుణ్నీ దర్శించుకోవాలి. అభిషేకతీర్థం వెలికి వచ్చే దారి వరకూ వెళ్లి, తిరిగి వచ్చి, మళ్లీ నందిశివదేవులను దర్శించుకోవాలి. ప్రదోషసమయంలో నందీశ్వరునికి పుష్పమాలలు సమర్పించి, ఎర్రని బియ్యాన్ని అర్పించాలి. నంది కొమ్ముల మధ్యన పిడికెడు గరికను వుంచి నమస్కరించుకోవాలి. ప్రదోషసమయంలో మహాదేవునికి బిల్వమాలలు సమర్పించుకుంటే అత్యుత్తమఫలాలు దక్కుతాయి.


నవగ్రహప్రదక్షిణలు :


శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.


''ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:'' అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.


మొదటి ప్రదక్షిణలో... జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!


రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!


మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు!


నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యామిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!


ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!


ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు!


ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!


ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!


తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!


అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.


నవగ్రహదోషాలు గలవారు, ఆయా గ్రహాలకు నిర్ణయించిన ధాన్యాలను సమర్పించుకుంటూ పూజలు చేయాలి. సూర్యునికి గోధుమలు, చంద్రునికి బియ్యం, అంగారకునికి కందిపప్పు, బుధునికి పెసలు, గురువుకు సెనగలు, శుక్రునికి చిక్కుడుగింజలు, శనికి నువ్వులు, రాహువుకు మినపపప్పు, కేతువుకు ఉలవలు-ఇదీ పద్ధతి.
ఆలయ దర్శనం :

దైవదర్శనానికి వెళ్లే సమయంలో మనం ధరించిన దుస్తులతో పాటు శరీరమూ, మనస్సూ కూడా పరిశుభ్రంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. నుదుటన చక్కగా విభూతి లేదా కుంకుమ ధరించాలి. అలాగే, ఆలయప్రవేశం చేసేముందు తప్పనిసరిగా కాళ్లూ, చేతులూ కడుక్కునే లోపలికి వెళ్లాలి.

మనతో ఎవరైనా వస్తుంటే వారితో గట్టిగా మాట్లాడు కుంటూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయానికి వస్తున్నామంటే మన మనస్సంతా ఆ దైవంమీదనేలగ్నం చెయ్యాలి. మనసులో ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఆలయానికి వెళ్లాలి. లేదా ఏ దేవతను సందర్శించేందుకు వెడుతున్నామో ఆ దేవత నామాన్ని స్మరిస్తూ లోపలికి వెళ్లాలి.

ఆలయంలోకి ప్రవేశింపచేసే రాజగోపుర ద్వారాన్ని దర్శించి రెండుచేతులూ జోడించి స్వామి దర్శనం తనివి తీరా చేయించమని గోపురాన్ని వేడుకోవాలి. లోపలికి వెళ్లగానే ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉండే నిలు వెత్తు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభమంటే నిజమైన భక్తునికి నిదర్శనం. ఎప్పుడూ స్వామి సన్నిధిలో నిశ్చలమైన ధ్యానముద్రలో ఉండే ఈ స్తంభానిదే అసలు పుణ్యమంతా. అందుకే చాలా పవిత్రంగా ఈ స్తంభానికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసినా ఉత్తమ ఫలితం వస్తుంది.

అనంతరం బలిపీఠా (సాధారణంగా అమ్మవారి, శివాలయాల్లో ఇది ఉంటుంది)న్ని సందర్శించి మనలో పేరుకున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను బలి చేస్తున్నట్టు భావించి, వీటి స్థానంలో ప్రేమ, త్యాగం, దాతృత్వంఇత్యాది గుణాలను అలవడేలా చెయ్యమని ప్రార్థించుకోవాలి.

అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసుకుని అనంతరం ఆలయంలోని తొలిపూజల వేల్పు గణనాథుణ్నిదర్శించి మొక్కాలి. ఈ స్వామికి గుంజీళ్లంటే ఇష్టం. 'దండాలయ్యా ఉండ్రాలయ్యా' అంటూ భక్తితో మూడునుంచీ అయిదుకు మించకుండా శక్తిమేరకు గుంజీళ్లు తీసి స్వామి అనుగ్రహాన్ని అర్థించాలి. భక్తితో నమస్కరిస్తే చాలు పరవశించి వరాలననుగ్రహిస్తాడీ కరి ముఖ వరదుడు.

అనంతరం ఆలయ ప్రధాన మూల విరాట్టును దర్శించే ముందు ఇంకా ఈ ఆలయంలో ఇతర దేవతా మూర్తులు కొలువై ఉంటే వారిని దర్శించుకోవాలి. ఉపాలయాల్లోని ఆ మూర్తులను దర్శినంచిన అనంతరం ప్రధాన మూర్తి దర్శనానికి రావాలి. వైష్ణ్వాలయమైతే ఈ స్వామి గర్భాలయానికి ఎదురుగా వుండే గరుడాళ్వారునూ, గర్భగుడి సింహ ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకులనూ సేవించుకుని, స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించమని వారిని కోరుకుని స్వామివారి కంటే ముందుగా వారి దేవేరి అయిన అలమేలు మంగమ్మను, శివాలయంలోనైతే పార్వతీదేవిని దర్శించాలి. ఆ తరువాత ప్రశాంత చిత్తంతో ప్రధానమూలవిరాట్టు అనుగ్రహం కోసం ప్రార్థించుకుంటూ ఆయన్ను దర్శించాలి.

స్వామిని దర్శించే సమయంలో ఒక్క క్షణాన్ని వృథా పోనీయకుండా తనివితీరా దర్శించాలి. అంతేకానీ, కళ్లు మూసుకుని ప్రార్థించకూడదు. (అయితే, ఇక్కడో విషయం ఉంది. నిజమైన భక్తులకు ఆ భక్తిపారవశ్యంలో కళ్లు మూసుకున్నా కూడా ఆయనమూర్తి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి భక్తులకిది మినహాయింపే మరి!) స్వామిని ఆపాద మస్తకం దర్శించాలి. అంటే- ముందుగా పాదాలనే చూడాలి. ఆ చరణాలే మనకు శరణాన్ని ప్రసాదిస్తాయన్న మాట. తరువాత, అభయాన్ని ప్రసాదించే హస్తాలు, ఆపై, కరుణను చిలకరించే నేత్రాలు, చిరునవ్వు చిందించే వదనం, ఇలా స్వామిని తిలకించి పులకించాలి.

అమ్మవారినైతే ముందుగా దయను వర్షించే నేత్రాలను, సౌభాగ్యసిద్ధి కలిగించే మాంగల్యాన్ని, అభయాన్నందించే హస్తాలు, ఆపై ఆప్యాయతగా మనవద్దకు వచ్చే ఆ శ్రీ చరణాలనూ దర్శించాలి.కిందికి చూస్తూ, తల్లిని చూసే చిన్నపిల్లల్లా మనసంతా ఆమెనే నింపుకుంటూ దర్శించుకోవాలి.

తరువాత ఆలయంలో ఎక్కడైనా కాసేపు కూర్చుని ప్రశాంతంగా స్వామిని ప్రార్థించుకోవాలి. తరువాత, ద్వారపాలకులను మనసులోనే దర్శించుకుని, వారి అనుమతిని కోరుకుంటూ, బయలుదేరాలి.

తరువాత మళ్లీ ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసుకుని తిరిగి వెళ్లాలి.

శివాలయాల్లో మామూలుగా ధ్వజస్తంభం వద్దే నందీశ్వరుణ్ని ప్రతిష్ఠించి వుంటారు. ఇట్లాంటి చోట్ల నంది తోకను భక్తిశ్రద్ధలతో తాకి కళ్లకద్దుకోవాలి.

తరువాత నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి వంగి చూస్తూ, ఎదుట వున్న పరమేశ్వరుణ్ని దర్శించుకోవాలి. ఆ తరువాతే ఆలయప్రవేశం చేసి వినాయకుణ్ణి దర్శించుకోవాలి.

నందీశ్వరుడూ, ధ్వజస్తంభమూ లేని ఆలయాల్లో వినాయకుణ్ణి ముందుగా దర్శించుకుని, స్తుతించుకుంటూ ముందుకు పోవాలి.

శివాలయాల్లో చిట్టచివర దర్శించుకోవలసిన దైవం చండికేశ్వరుడు. ఆయన నిరంతరమూ ధ్యానంలో వుంటాడు కనుక, ఆయ

30 October 2013

Panch Mahapurush Yoga :

Panch Mahapurush Yoga is a combination of five different yoga formed by five different planets. The person who has these five different yoga in the horoscope ,is blessed with everything in his life as these Panch Mahapurush planets gives their influence on one’s life. Generally we can observe that if someone has five strong and good planets out of 9 planets, will get good name, fame and money. This is like “Two and Two makes Four. These Yogas and planets are as Malavaya yoga (Venus), Shasha yoga (Saturn), Hamsa yoga (Jupiter), Bhadra yoga (Mercury) and Ruchaka yoga (Mars). These Yogas are formed if these planets are placed in their sign of exaltation and are in Kendra from Lagna or Moon. Being in Kendra, these planets gives influence to the native’s profession, education and on overall happiness. We will discuss about all these Yoga and their influences on life.

Malavaya yoga (Venus):
Malavaya yoga is formed by Venus, placed in sign of exaltation (Pisces) , and in Kendra form Moon or Lagna. Venus is the planet of money, luxury, vehicles, comforts, desires , Fairness, beauty and pleasures etc., A strong Venus with Malavaya Yoga, blesses the native with all these comfort and qualities. In male horoscope, it represents wife, Venus bless the person with beautiful, skillful and supporting wife. In female horoscope, it blesses her the beauty and intelligence. Venus formed Malavaya Yoga when it is placed in Pisces Sign and in Kendra from Moon or Lagna.


Shasha yoga (Saturn) : Saturn is a slow planet , it gives Misery, Poverty and struggle to the native, it teaches the original lesson of life to the native. So as a result , the native comes up as a refined Diamond with new ideas, lessons, struggle of life. On other hand , Saturn has power to change one’s destiny in very short after the teaching the lesson. So because of Shasha Yoga, native becomes very serious, calculative and clam in his decisions and there are less possibility for him to fail anywhere. For this yoga ,Saturn should be exalted in Libra sign, placed in Kendra from Moon or Lagna.


Hamsa yoga (Jupiter): Jupiter is the teacher (Guru), the way to reach to on the top. Guru represents blessings by God, and its drishti on Lagna, Sun or Moon in a chart is considered very fortunate. Jupiter is Karaka for name, fame and money. if Guru is the strongest planet in the chart and if it influences Kendras, the person would be lucky and due to divine intervention, he would never get in trouble. Guru is karaka for husband in wife horoscope, so it will bless the lady with a good husband, on other hand being karaka for children, the person is blessed with good children too. Jupiter in sign Cancer, placed in Kendra from Lagna or Moon, creates Hamsa Yoga and bless the native.


Bhadra yoga (Mercury) : Due to Bhadra Yoga, Mercury makes a person highly intelligent, great commutation skills (Oral & written), a good businessman. He will be able to deliver his idea and influence the people with his tactics. With good mathematical and financial skills , he will use his money in good areas of income and gains. So we can say a person blessed with this yoga will be automatically rich. Mercury in his own sign Virgo, placed in Kendra from Lagna or Moon, creates Bhadra Yoga.


Ruchaka yoga (Mars) : Mars is the commander, a young and energetic planet. Due to it’s 4th aspect , Mars being placed in Kendra, influences the profession of the native. Mars is known for bravery, courage and initiative. So in Ruchaka Yoga, mars gives the both positive and negative influence, if Mars has good Drishti from a beneficial planet, the person can be in army, police and surgeon etc, otherwise it can also make the person a criminal. Mars in sign Capricorn, placed in Kendra from Lagna or Moon, forms Ruchaka Yoga.
నారదమహర్షి :

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, విష్ణు భక్తుడు, దేవర్షి అని అందరికీ తెలిసినదే. ఆయన అనుగ్రహమే ప్రాతిపధికగా వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, భాగవతాది ఉత్కృష్ట రచనలు మనకు అందిచారు. నారదుడు అన్న పేరు గల వారు, పురాణేతిహాసాలలో ఏడుగురు కనిపిస్తారు.

బ్రహ్మ యొక్క మానస పుత్రుడు

పర్వతుడు అనబడే ఋషియొక్క మామగారు
వసిష్ఠుని భార్య ఐన అరుంధతికి సోదరుడు; లేదా సత్యవతి అనే ఆమెకు భర్త
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మొదట జగడాలకు తెర తీసినా, చివరికి అది లోక కల్యాణం వైపుకు దారి తీసేట్టు చేయువాడు
కుబేరుని సభాసదుడు
శ్రీరామచంద్రుని సభలో ఉన్న ఎనిమిది మంది ధర్మశాస్త్రవిదులలో ఒకడు
జనమేజేయుని సర్ప యాగం సదస్యులలో ఒకడు

ఇంతకీ అసలు నారదులవారు ఎవరు?


భగవంతుడు స్వయంగా ఎలా అవతరిస్తుంటారో, అలాగే కారణ జన్ములైన మహాపురుషులు కూడా లోకములో అప్పుడప్పుడూ అవతరించి ఆ భగవంతుడి లీలల కొరకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అలాంటి మహాపురుషులు అవిద్య, అహంకారము, మమకారములవంటి వికారాలు లేని ముక్త పురుషులై ఉండి కూడా, ముక్తులుగా కాక లోకంలోని జీవుల మధ్యలో తిరుగాడి వారి కల్యాణంకొరకై పాటుపడుతుంటారు. ప్రధానమైన భగవద్ అవతారం సంభవించినపుడు వీరి కార్యభారము పెరిగిపోతుంటుంది. వీరివలన జరిగే కార్యాలన్నీ భగవంతుడి కార్యాలే! అలాంటి మహాపురుషులలో, దేవర్షి నారదుడు ఒకరు. అన్ని యుగాలలో, అన్ని లోకాలలో, ప్రతీ శాస్త్రంలో, అన్ని సమాజాలలో, అన్ని పనుల్లో నారదునికి ప్రవేశమున్నట్టు తెలుస్తోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరలలోనే కాక, ఈ ఘోర కలికాలంలో సైతం ఆయన ఉన్నట్టు; అర్హతగల భక్తులకు ఆ మహాభాగుని దర్శనం లభిస్తుంటుందని పెద్దలు చెబుతుంటారు.


అన్ని శాస్త్రాలలో మహాపండితుడు, సమస్త తత్త్వపరిజ్ఞాత, వ్యాఖ్యాత అయి ఉండీ, నారదుడు భక్తిమార్గాన్నే ప్రవర్తిల్ల చేసినట్టు తెలుస్తున్నది. వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు, శుకయోగి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహానుభావులకు భక్తి మార్గంలో మార్గ దర్శకత్వం చేసినది ఈయనే కదా!


ఇంతకీ ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం – స్వయంగా ఈయనే వ్యాసమహర్షికి తెలియజేసారు. రెండు కల్పాలకు సంబంధించిన చరిత్ర శ్రీమద్భాగవతంలో కనబడుతుంది.


దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…


మహానుభావా! నేను గడిచిన కల్పంలో గత జన్మంలో – ఒక దాసీ పుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పని చేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకి పరిచర్య చేసే వాణ్ణి.


ఓ పుణ్య చరిత్రా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోడిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధమూ, పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండనీ వాననీ లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాటాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి.


ఈ ప్రకారంగా వర్షాకాలమూ, శరత్కాలమూ గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణమూ ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలై నాకు వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి, బ్రహ్మ స్వరూపుణ్ణీ అయిన నా యందు, స్థూలమూ సూక్ష్మమూ అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితం అని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులైనారు.


ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధీంచినందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతులైనారు. ఎంతో సంతోషంతో, ఎంతో కారుణ్యంతో ఎంతో వాత్సల్యంతో అతిరహస్యమూ, అమోఘమూ అయిన ఈశ్వరజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. నేనుకూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావం తెలుసుకున్నాను. ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం. లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పొగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితే కానీ ఆ రోగం శాంతించదు.


ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు.


ఓంకారపూర్వకంగా వాసుదేవ – ప్రద్యుమ్న – సంకర్షణ – అనిరుద్ధ నామాలు, నాలుగూ భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు. నేను ఈ విధంగా ప్రవర్తించినందువల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి నారాయణ మూర్తికి తెలుసు. వ్యాస మహర్షీ! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు.


మునులలో అగ్రేసరుడవు. ఎంతో ఎరుక కలవాడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతాలకు శాంతి లభించేటట్లు నీవు చక్కగా వాసుదేవుని యశోగాథలను సంస్తుతించు. ఈ విధంగా నారదమునీంద్రుడు తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించి, వ్యాసముని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు.


అయ్యా! మహానుభావులైన ఆ సాధువులు ఎంతో దయతో నీకు ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు గదా! ఆ తరువాత నీ బాల్యం ఎలా గడిచింది? దాసీ పుత్రుడవైన నీవు ఏ ప్రకారంగా నీ దేహాన్ని త్యజించావు? దయచేసి వివరించు.


వ్యాసులవారు అడిగిన ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు.


ఆ విధంగా నేను ఆ సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొందిన సంగతి విన్నారు కదా! మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ వరుసగా చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేదికాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. “అయ్యో! నా బిడ్డ అలసిపోయాడు, సొలసిపోయాడు, ఆకలి గొన్నాడూ” అని అంటూ రేపులూ మాపులూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటి మాటికీ నా బుగ్గలు ముద్దుపెట్టుకొనేది. నా జుట్టు దెవ్వేది. నా ఒళ్ళు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను.


అయితే నేను సంసారవ్యామోహంలో చిక్కు బడలేదు. జ్ఞానాన్ని కోల్పోలేదు. విషయాంతర వ్యాసక్తుణ్ణి కాలేదు. పంచ వర్షప్రాయం గల నేను అలాగే మా అమ్మను కనిపెట్టుకొని మౌనంగా ఆ బ్రాహ్మణుల ఇండ్లలో కొన్నాళ్ళు గడిపాను.


వ్యాస మునీంద్రా! ఒకనాడు ఏమి జరిగిందంటే మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవును పాలు పిండటం కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళింది. త్రోవలో ఆమె ఒక పామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరిచింది. అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయింది. అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఆ విషాద దృశ్యాన్ని చూచి ఏ మాత్రం కలవరపడకుండా, నా చిత్తం శోకాయత్తం కాకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. ‘మంచిది; బంధం తెగిపోయింది’ అనుకొన్నాను. ఇక నాకు హరి చరణ స్మరణమే అవశ్య కర్తవ్యమని నిర్ణయించుకొన్నాను.


ఆ విధంగా అనుకొని నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలూ, పట్టణాలూ, నగరాలూ, జనపదాలూ, గ్రామాలూ, పేటలూ, భిల్లవాటికలూ దాటుకొంటూ; ఆటవికులు నివసించే చిట్టడవులూ, రంగు రంగుల ధాతువులతో కూడిన పర్వతాలూ, మదించిన ఏనుగులు కదిలించే విదిలించే కొమ్మలు గల మహావృక్షాలూ, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలూ, నానావిధాలైన పక్షుల కలకలా రావాలతో రమణీయమై వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమీంచే గండుతుమ్మెదలతో నిండిన సరస్సులూ అతిక్రమిస్తూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలీ దప్పికా అతిశయించాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.


తోడేళ్ళూ, కోతులూ, ఎలుగుబంట్లూ, వనవరాహాలూ, ఏనుగులూ, మహిషాలూ, ఏదుపందులు, గుడ్లగూబలూ, శరభమృగాలూ, శార్దూలాలూ, కుందేళ్ళూ, మనుబోతులూ, ఖడ్గమృగాలూ, క్రూరసర్పాలూ, కొండచిలువలూ నిండిన భయంకరారణ్యాల గుండా మళ్ళీ ప్రయాణించాను.


దాట శక్యం కాని నీలి తుప్పలతో కూడిన వెదురు పొదరిండ్ల దగ్గిరరగా ఒక రావిచెట్టు క్రింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.


నా కన్నుల్లో ఆనందబాష్పాలు పొంగిపొరలాయి. నా శరీరమంతా పులకించిపోయింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైంది.


నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరిగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో వాచామగోచరుడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి.


నాయనా! ఎందుకు వృథాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతే కాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నా భక్తి అచిరకాలంలోనే నీ మదిలో పదిలమౌతుంది. కుమారా! నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్ళీ జన్మలో నా భక్తుడవై ఉద్భవిస్తావు. విను చిట్టితండ్రీ! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వ స్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్య గుణసంపన్నులైన హరి భక్తులలో అగ్రగణ్యుడవై పేరెన్నిక గంటావు.


ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయంబయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని నిర్జించాను. క్రోధాన్ని వర్జించాను. లోభాన్ని, మోహాన్ని పారద్రోలాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమపవిత్రాలయిన హరి చరిత్రాలను స్మరిస్తూ నిత్యసంతుష్టుడినై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్ళకు మెరుపు మెరిసినట్టుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవ జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని విశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలయిన మునులూ, నేనూ జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంతట తామే మ్రోగే ఈ “మహతీ” వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను.


తీర్థపాదుడైన దేవాది దేవుడు వాసుదేవుడు. నేను ఆయన లీలలను గానం చేసినప్పుడు పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో అచ్చు గ్రుద్దినట్లు కానవచ్చేవాడు.


ఓ వ్యాసమునీంద్రా! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్పవంటిది.


యమమూ, నియమమూ, ప్రాణాయామమూ, ప్రత్యాహారమూ మొదలైన అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామమూ, రోషమూ మొదలైన వానిచే అది మాటి మాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కాని శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. మునికులభూషణా! నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.


అని ఈ ప్రకారంగా పరమపూజ్యుడైన బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు బాదరాయణ మునింద్రునితో పలికి వీడ్కోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు.
నారదమహర్షి :

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు, విష్ణు భక్తుడు, దేవర్షి అని అందరికీ తెలిసినదే. ఆయన అనుగ్రహమే ప్రాతిపధికగా వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, భాగవతాది ఉత్కృష్ట రచనలు మనకు అందిచారు. నారదుడు అన్న పేరు గల వారు, పురాణేతిహాసాలలో ఏడుగురు కనిపిస్తారు.

బ్రహ్మ యొక్క మానస పుత్రుడు
పర్వతుడు అనబడే ఋషియొక్క మామగారు
వసిష్ఠుని భార్య ఐన అరుంధతికి సోదరుడు; లేదా సత్యవతి అనే ఆమెకు భర్త
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మొదట జగడాలకు తెర తీసినా, చివరికి అది లోక కల్యాణం వైపుకు దారి తీసేట్టు చేయువాడు
కుబేరుని సభాసదుడు
శ్రీరామచంద్రుని సభలో ఉన్న ఎనిమిది మంది ధర్మశాస్త్రవిదులలో ఒకడు
జనమేజేయుని సర్ప యాగం సదస్యులలో ఒకడు

ఇంతకీ అసలు నారదులవారు ఎవరు?

భగవంతుడు స్వయంగా ఎలా అవతరిస్తుంటారో, అలాగే కారణ జన్ములైన మహాపురుషులు కూడా లోకములో అప్పుడప్పుడూ అవతరించి ఆ భగవంతుడి లీలల కొరకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అలాంటి మహాపురుషులు అవిద్య, అహంకారము, మమకారములవంటి వికారాలు లేని ముక్త పురుషులై ఉండి కూడా, ముక్తులుగా కాక లోకంలోని జీవుల మధ్యలో తిరుగాడి వారి కల్యాణంకొరకై పాటుపడుతుంటారు. ప్రధానమైన భగవద్ అవతారం సంభవించినపుడు వీరి కార్యభారము పెరిగిపోతుంటుంది. వీరివలన జరిగే కార్యాలన్నీ భగవంతుడి కార్యాలే! అలాంటి మహాపురుషులలో, దేవర్షి నారదుడు ఒకరు. అన్ని యుగాలలో, అన్ని లోకాలలో, ప్రతీ శాస్త్రంలో, అన్ని సమాజాలలో, అన్ని పనుల్లో నారదునికి ప్రవేశమున్నట్టు తెలుస్తోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరలలోనే కాక, ఈ ఘోర కలికాలంలో సైతం ఆయన ఉన్నట్టు; అర్హతగల భక్తులకు ఆ మహాభాగుని దర్శనం లభిస్తుంటుందని పెద్దలు చెబుతుంటారు.

అన్ని శాస్త్రాలలో మహాపండితుడు, సమస్త తత్త్వపరిజ్ఞాత, వ్యాఖ్యాత అయి ఉండీ, నారదుడు భక్తిమార్గాన్నే ప్రవర్తిల్ల చేసినట్టు తెలుస్తున్నది. వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు, శుకయోగి, ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి మహానుభావులకు భక్తి మార్గంలో మార్గ దర్శకత్వం చేసినది ఈయనే కదా!

ఇంతకీ ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం – స్వయంగా ఈయనే వ్యాసమహర్షికి తెలియజేసారు. రెండు కల్పాలకు సంబంధించిన చరిత్ర శ్రీమద్భాగవతంలో కనబడుతుంది.

దివ్య దృష్టి సంపన్నుడైన వేదవ్యాసమహర్షి, లోక కల్యాణార్థమై వేదములను నాలుగు భాగములుగా విభాగించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని – ఎన్నో ఆఖ్యాన, ఉపాఖ్యానాలతో లోకాలకు అందించాడు. పురాణాలను రచించాడు. ఐనా తృప్తి కలుగక పరిపూర్ణ శాంతిని పొందలేదు. ఏదో తక్కువ ఐనట్టు వ్యథ చెందుతున్నప్పుడు, నారద మహర్షి అక్కడికి చేరుకొంటారు. తన పరిస్థితిని తెలియజేసి నివారణోపాయాన్ని వ్యాసుడు తెలియజేయమని కోరుకుంటాడు. అప్పుడు నారదులవారు, తన అన్ని రచనలలో ధర్మాలను వివరించిన విధంగా, (అంటే ధర్మబోధయే ప్రధాన లక్ష్యం) భగవంతుని కీర్తిని కీర్తించలేదు కాబట్టి తనకు అలా వెలితిగా తోస్తున్నదని తెలియజేసి, తన పూర్వ వృత్తాంతాన్ని తెలిపి, వ్యాసుడిని శ్రీమద్భాగవత రచన చేయవలసినదిగా సెలవిస్తారు. అలా నారదుల వారు వ్యాసుడికి తెలిపిన తన వృత్తాంతం…

మహానుభావా! నేను గడిచిన కల్పంలో గత జన్మంలో – ఒక దాసీ పుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పని చేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకి పరిచర్య చేసే వాణ్ణి.

ఓ పుణ్య చరిత్రా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోడిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధమూ, పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి. నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి. ఎండనీ వాననీ లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాటాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి.

ఈ ప్రకారంగా వర్షాకాలమూ, శరత్కాలమూ గడిచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణమూ ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలై నాకు వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించడం ఆరంభించాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి, బ
65 కళలు.... ( 64 కళలకు " కంప్యూటర్ పరిగ్యానము " ను ఒక కళగా కలిపితే 65 కళలు అయినవి ) :

" Now the question to the Face Book ఫ్రెండ్స్ is .... ఎవరికి ఎన్ని కళలో ప్రవేశం ఉందో తెలుపగలరు .."


1. వేదములు

(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు
(శిక్షలు. వ్యాకరణము. ఛందస్సు .జ్యోతిషము. నిరుక్తము. కల్పములు )

3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు


4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.


5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు


6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము


7. నాటకములు


8. గానము (సంగీతం)


9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము


10. కామశాస్త్రము


11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,


12. దేశభాషాజ్ఞానం


13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.


14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు


15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము


16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,


17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము


18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము


19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం


20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము


21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము


22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము


23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము


24. పాకకర్మ= వంటలు


25. దోహళము=వృక్షశాస్త్రము


26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు


27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య


28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .


29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.


30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.


31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.


32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య


33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య


34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య


35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,


36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు. వాడుకరి:Anish.bharatha/Maya Angelou 37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,


38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,


39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.


40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.


41. వాణిజ్యము - వ్యాపారాదులు.


42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.


43. కృషి - వ్యవసాయ నేర్పు.


44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి


45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.వాడుకరి:Anish.bharatha/
Maya Angelou

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.


47. మృగయా - వేటాడు నేర్పు


48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.


49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.


50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.


51. చిత్ర - చిత్రకళ


52. లోహా - పాత్రలు చేయి నేర్పు


53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.


54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు


55. దారు - చెక్కపని


56. వేళు - వెదరుతో చేయు పనులు


57. చర్మ - తోళ్ళపరిశ్రమ.


58. అంబర - వస్త్ర పరిశ్రమ


59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు


60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము


61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము


62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము


63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము


64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్యజలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.


65. కంప్యూటర్ పరిగ్యానము
శంకర భగవత్పాదుల విరచితము :

మాతా నాస్తి, పితా నాస్తి నాస్తి బంధు సహోదరః
అర్థం గృహం నాస్తి తస్మాత్ జాగర్త జాగర్త

జన్మ దుఃఖం, జారా దుఃఖం జాయ దుఃఖ పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగర్త జాగర్త!

కామ క్రోదశ్చ లోభశ్చ దేహీ తిష్టాంతి తస్కరహ
జ్ఞాన రత్న అపహార అర్థాయ తస్మాత్ జాగర్త జాగర్త!

ఆశయా బాధ్యతే లోకాః కర్మణా బహు చింత్యహ
ఆయుః క్షణామ్ జానతి తస్మాత్ జాగర్త జాగర్త!

సంపాదాహ స్వప్న సంకాసాహ యౌవనం కుసూమూపమం
విద్యుత్ కంకాలం ఆయుష్యం తస్మాత్ జాగర్త జాగర్త!

క్షణామ్ విత్తం క్షణామ్ చిత్తమ్ క్షణం జీవితమీవ క
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగర్త జాగర్త!

అనిత్యాని శరీరాణి విభవానైవ శాశ్వతాః
నిత్యం సన్నిహితి మృత్యుహూ తస్మాత్ జాగర్త జాగర్త
జాతక చక్రాలు:

జాతక చక్రాలు చూసున్నారుగా. 12 గళ్ళుంటాయి. ఒక గదిలొ "ల" అని వ్రాసుంటారు. ఇదే లగ్నం. దీనిని స్టార్టింగ్ పాయింటుగా ఉంచుకుని క్లాక్ వైస్ లెక్కించాలి. ఇక ఏ గది ఏ ఏ విష్యాలను సూచితుందో చూద్దాం:
1.లగ్నం జాతకుని శరీరం,గుణ గణాలు
2.దన వాక్కు కుటుంభ నేత్ర స్థానం

3.సోదర స్థానం జాతకుని దైర్య సాహసాలను, ప్రయాణాలను సంగీత జ్ఞానాన్ని సూచితుంది
4.మాత్రు భావం: తల్లి ఇల్లు వాహణం విథ్య తల్లి తరపు బంధువులను,శీలం
5.పుత్రభావం: బుద్ది,పుత్ర పుత్రికలు,అద్రుష్థం ,ద్యానం యోగం
6.శత్రు రోగ రుణ స్థాన,
7.కళత్ర భావం: ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ లను సూచిస్తుంది
8.ఆయువు స్థనం: తీరని రోగాలు,అప్పులు,జైలు పాలు,గండాలు,మరణం,దివాళా తీయడం,మర్మాంగం
9.భాగ్య భావం: తండ్రి,తండ్రి తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తిర్త యాత్రలు,మోకాలు
10.జీవన భావం: వ్రుత్తి,వ్యాపారాలు,పదవులు,పాప
క్రుత్యములు
11. లాభ భావం: వ్యాపారం,ఎల్డర్ బ్రదర్ సిస్టర్
12.వ్యయ భావం: సెక్స్ లైఫ్,నిద్రా,ఖర్చులు పెట్టే విధానం,పాదాలు

కొన్ని చిట్కాలు:
జాతకం చూడగానే అందులో శని కుజ కలిసారా చూడండి. ఆ కలిసిన స్థానం 3,6,10,11 తప్ప మరే చోటైనా జరిగుంటే దానిని పక్కన పెట్టెయ్యండి. దానికి ఫలితం చెప్పాలంటే అనుభవం అవసరం

అలాగే లగ్నం నుండి 6,8,12 వ స్థానాలు ఖాళిగా ఉందా చూడండి


ఏడవ స్థానం కూడ ఖాళి ఉంటే మంచిది సుమా

దోషాలు కనుగొను విదానం:
కుజ గ్రహం లగ్నాత్తు 3,6,10,11 తప్ప మరెక్కడున్నా ఇబ్బందే ,అలా ఉంటే దానిని కుజ దోషం అంటారు
ఏలినాటి శని :

జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు జ్యోతిష్య నిపుణులు/
. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 -1/2 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.


శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది


ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?


ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని , ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పెద్దలు చెబుతున్నారు.


అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.


ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు
.


ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- 
 ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును
Jyothishya Methods :

సాయన విధానం. దీనినే సూర్యమానం అని కూడా అంటారు.ఇది పాశ్చాత్యులు ఎక్కువగా వాడుతారు. ఇందులో ఋతువులు, సూర్య గమనం, రాశులు, గ్రహగతులు, ముఖ్యంగా చూస్తారు. వీరికి దశావిధానం లేదు. Primary and secondary directions వాడతారు. Primary directions లో ఒక డిగ్రీ ఒక సంవత్సరానికి సమానం. Secondary directions లో ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. ఇప్పుడు Tertiary directions కూడా వచ్చింది.యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో మొదలైన గ్రహాలను లెక్కిస్తారు.
నిరయన విధానం దీనిని చాంద్రమానం అనీ నక్షత్రమానం అనీ అంటారు.ఇది మన భారతీయ విధానం.ఇందులో నవగ్రహాలను లెక్కిస్తారు. ఉపగ్రహాలున్నప్పటికీ వాటిని పెద్దగా వాడటం లేదు.నక్షత్ర దశలు, గ్రహములకు గల ప్రత్యేక దృష్టులు,యోగములు,గ్రహావస్థలు మొదలైనవి ప్రధానమైన విషయాలు.మన విధానంలో ముఖ్యంగా పరాశర, జైమిని, తాజక,నాడీ విధానాలున్నాయి. భృగు,గర్గ,కశ్యపాదుల పద్దతులున్నాయి. ఇవి కాక అనేక ఇతర విధానాలున్నాయి.
పరాశర విధానం ఇందులో వర్గ చక్రాలు,వివిధ దశావిధానాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. షడ్వరులు, సప్త వర్గులు, దశవర్గులు,షోడశ వర్గులు ముఖ్యమైనవి.గ్రహ యోగాలనూ, దశలనూ,గోచారాన్నీ, అష్టక వర్గులనూ కలిపి ఫలితాలను ఊహించడం జరుగుతుంది. పరాశర మహర్షి ఇంకా ఎన్నో విషయాలను చర్చించినప్పటికీ ముఖ్యంగా వీటినే పరిగణనలోకి తీసుకుంటున్నాము.
జైమిని విధానం ఇందులో కారకాంశ, రాశి దృష్టులు,రాశి దశలు, ఆరూఢ లగ్నాలు,శూల దశ,చరదశ వంటి ప్రత్యేక దశలు ఉంటాయి. ఆయుర్గణనలో విభిన్న పద్దతులు ఈయన ప్రత్యేకత. ఈ విధానాని పరాశర మహర్షి చర్చించినప్పటికీ దీనిని ఒక ప్రత్యేక విధానంగా జైమిని మహర్షి తయారుచేయటం తో ఆయన పేరుమీద చలామణీలోకి వచ్చింది. దీనిని వాడేవారు తక్కువగా ఉంటారు.
తాజక విధానం ఇది సాయన పద్దతికి దగ్గరగా ఉంటుంది. సహమములు, పాత్యాయనీ దశ, ముద్ద దశ, వర్ష ప్రవేశం, ముంధా బిందువు, ఇతశల, ముతశిల యోగం ఇత్యాది ప్రత్యేకతలుంటాయి.ఇందులోని యోగాలన్నీ పాశ్చాత్యుల విధానపు దృష్టులే. దీనిని ఎక్కువగా ప్రశ్న శాస్త్రంలో ఉపయోగిస్తారు.
నాడీ విధానం లేక భృగు సంహితా పద్దతి ఇది చాలా ప్రత్యేకమైన పద్దతి. ఒక రాశిని 150 భాగాలుగా విడగొట్టి దానిని బట్టి సూక్ష్మమైన ఫలితాలను చెప్పేదే నాడీ విధానం. దీనిలో చాలా రకాలైన నాడీ గ్రంధాలున్నాయి. ఫలితాలు కూడా చాలా విచిత్రంగా సరిపోతాయి. ఇందులో రాశి తుల్య నవాంశ పద్దతి, నాడీ అంశలపైన గ్రహాల సంచారం మొదలైనవాటిని బట్టి ఫలితాలు ఊహిస్తారు.ఇవిగాక K.P system ఇంకొక విధానం. భారతీయ పాశ్చాత్య పద్దతులను కలిపి సబ్ లార్డ్ థియరీతో రంగరించి దీన్ని ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు తయారు చేశారు.దీనిలో ఒక్కొక్క నక్షత్రాన్ని వింశోత్తరీ పద్దతిలో విభజించి సబ్ అనబడే సూక్ష్మ విభాగాన్ని తెచ్చారు. దీనిని మళ్లీ ఇదే పద్దతిలో విడగోట్టి సబ్ సబ్ అనే ఇంకా సూక్ష్మ విభాగాన్నితెచ్చారు. పాశ్చాత్యులు వాడే ప్లాసిడస్ హౌస్ సిస్టం ను ఈయన ఉపయోగించారు. హౌస్ కస్ప్ లు, సబ్ లార్డ్స్, సబ్ సబ్ లార్డ్స్, రూలింగ్ ప్లానెట్స్, హౌస్ రెలేషన్ షిప్ మొదలైన విభిన్న పద్ధతులతో ఆశ్చర్య కరమైన ఫలితాలు చెప్పవచ్చు. మిగిలినదంతా పరాశర విధానం వలెనే ఉంటుంది. ఇది ప్రాధమికంగా ప్రశ్న శాస్త్రం. కాని జనన జాతకానికి కూడా బాగా పనిచేస్తుంది.
కాల సర్ప యోగము:

రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా .....
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు, కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు, కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ వాదన... అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో అనుభవాలు కాదనలేనివి.

ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి. అప్పటి రోజులలో కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా... నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో నిరుపించాలేము కదా...
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.

 
కాల సర్ప యోగము:

 
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు, దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూడడము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును. ఇది భారతీయుల సిధాన్తము. యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిధాన్తము
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 - 7 స్థానము నందు ఉంటె భార్య, భర్తల మధ్య విరోధము, అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము కూడా ఉండక పోవచ్చుని.


రాహు కేతువుల కాల సర్ప యోగాలు:


యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి. ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:

1 - 7 అనంత కాలసర్ప దోషము దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 - 8 గుళిక కాలసర్ప దోషము దీనివలన కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 - 9 వాసుకి కాలసర్ప దోషము దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10 శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11 పద్మ కాలసర్ప దోషము దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12 మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1 తక్షక కాలసర్ప దోషము దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2 కర్కటక కాలసర్ప దోషము, దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3 శంఖచూడ కాల సర్ప దోషము దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4 ఘటక కాలసర్ప దోషము దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5 విషక్త కాలసర్ప దోషము దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6 శేషనాగ కాలసర్ప దోషము దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.

మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..


ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.

జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని కలిగించును. ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి యోగము కలుగును.

సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.

ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు.


సర్పదోషము, నాగ దోషము: జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా చెప్పుదురు. నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి గతులు:

 
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట జరుగును.


జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి
.


జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.
కాల సర్ప యోగము:

రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా .....
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు, కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు.  ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు, కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ వాదన... అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో అనుభవాలు కాదనలేనివి.
ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి.  గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి.  అప్పటి రోజులలో కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా... నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో నిరుపించాలేము కదా...
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.
కాల సర్ప యోగము:
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు, దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూడడము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును.  ఇది భారతీయుల సిధాన్తము.  యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిధాన్తము
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 - 7   స్థానము నందు ఉంటె    భార్య, భర్తల మధ్య విరోధము, అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము కూడా ఉండక పోవచ్చుని.

రాహు కేతువుల కాల సర్ప యోగాలు:

యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి.  ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:
1 - 7  అనంత కాలసర్ప దోషము   దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 - 8   గుళిక కాలసర్ప దోషము    దీనివలన  కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 - 9   వాసుకి కాలసర్ప దోషము   దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10   శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11   పద్మ కాలసర్ప దోషము      దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12   మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1    తక్షక కాలసర్ప దోషము        దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2     కర్కటక కాలసర్ప దోషము,   దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3    శంఖచూడ కాల సర్ప దోషము   దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4   ఘటక కాలసర్ప దోషము       దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5   విషక్త కాలసర్ప దోషము         దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6   శేషనాగ కాలసర్ప దోషము      దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.

మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..


ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.
జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని కలిగించును.  ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి యోగము కలుగును.

సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.
ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు. 

సర్పదోషము, నాగ దోషము:  జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా చెప్పుదురు.  నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి గతులు:
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట జరుగును.
జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి.
జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.
కుజ దోషము-పరిహారములు :

కుజగ్రహము గురించి: కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు

ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||

అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..

 
మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.

 
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది.

 
వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వామ
ు, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.
సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.

 
ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.

 
కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.


స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.


ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.


ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.


కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.


కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం.
కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము

 
కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
రక్త దానము చేయుట చాల మంచిది.
అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
భావము: వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu.

 
భావము: వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
భావము: వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
భావము: వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి..
భావము: అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
భావము: మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
భావము: నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
భావము: కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.
భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.
భావము: చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
-- ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు
కుజ దోషము-పరిహారములు :

కుజగ్రహము గురించి: కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు

ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు.  ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు.  కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు.  మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు.  శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు:  రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట  కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది
వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ  ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.

    సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.
    ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి  డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
    కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి.  కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
    స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
    ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
    ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.
    ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
    పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
    షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
    కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
    కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
    రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
    కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
    కుజదశలో కుజుని  అంతర్దశకు....ఉత్తరకాండ   ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
    కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ   యాభై ఎనిమిదవసర్గ,   తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
    కుజ దశలో కేతు అంతర్దశకు--     యుధకాండ   నూట పదహారు సర్గ ,   ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
    కుజ దశలో శని అంతర్దశకు --      అరణ్యకాండ   డెభై వ సర్గ --             నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
    కుజుదశలో బుధ అంతర్దశ ---        బాలకాండ పదహారవసర్గ   --           ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
    కుజు దశలో గురు అంతర్దశ --        సుందర కాండ యాభై ఒకటి సర్గ---     అరటిపండ్లు నైవేద్యము.
    కుజ దశలో శుక్ర అంతర్దశకు ---      సుందరాకాండ యాబై మూడు సర్గ --   పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
    .
    కుజ దశలో రవి అంతర్దశకు ---       బాలకాండ ఇరై మూడు సర్గ --           చామ కారెట్ దుంప నైవేద్యము.
    కుజదశలో రవి అంతర్దశకు ---        బాలకాండ పదిహేడవ సర్గ--              పాలు, పాయేసం నైవేద్యము
    కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
    సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
    ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
    బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
    మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
    స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
    ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
    కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
    రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
    పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
    రక్త దానము చేయుట చాల మంచిది.
    అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
    కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
    రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
    కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
    కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
    ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
    కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
    వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
    భావము:  వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu
    భావము:  వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో  చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
    భావము:  వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
    భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
    భావము:  వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి..
    భావము:  అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
    భావము:  మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
    భావము:  నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
    భావము:  కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.
    భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.
    భావము:  చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
    భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
    -- ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు
Easy way to remember Rahu Kalam :

Just remeber this phrase :
"Mother Saw Father Wearing The Turban"

M(other)- 7:30 - 9:00 - MONDAY
S(aw) - 9:00 - 10:30 -SATURDAY
F(ather) - 10:30 - 12:00 - FRIDAY
W(earing) - 12:00 - 1:30 -WEDNESDAY
TH(e) - 1:30 - 3:00 - THURSDAY
TU(rban) - 3:00 - 4:30- TUESDAY

Left with Sunday - 4:30 - 6:00
ASSUMING THE SUNRISE IS AT 6:00 AM
లగ్న ప్రశంస :
సులభముగా చలించబడు కనురెప్పపాటులో కోటి అంశ పరిమానకాలము లగ్నమునందు శుభకాలం అగును...
ఇది బ్రహ్మ కూడా తెలిసికొనుటకు సాధ్యం కాని కాలం .కావున ఈ మానవమాత్రులు ఈ శుభకాలంను కనుగొనుట అసాధ్యం , దుర్లభం ...
కనుక ప్రతి మనిషి కి జన్మాంతర కృత పుణ్యపాప కర్మానుసారము " లగ్నం " సంప్రప్తమగుచున్నది ...
ఈ జ్యోతిష్కులు సాక్షిమాత్రులే గాని లగ్న ప్రధాతులుకారు ...
జీవితం :
ప్రతి మనిషికీ జీవితం తాలుకు ఏదో ఒక కోణం చీకటితో అలుముకొని ఉంటుంది ...
అది తెలుసుకొని రాజీ పడకపోతే మొత్తం జీవితమే అంధకార బంధురంలాగా కనిపిస్తుంది ..
ప్రదక్షిణం :
గణపతికి ఒక్కసారి , రవికి రెండుసార్లు , శివునికి మూడుసార్లు , విష్ణువుకు నలుగుసార్లు , అశ్వద్ధ వృక్షానికి ఏడుసార్లు ప్రదక్షిణం చేయాలి .....
లగ్నాధిపతి :
లగ్నాధిపతి కేంద్రంలో ఉండి జన్మించిన వారికి ఎంతో కొంత శక్తితో పుట్టిన వారిగా చెప్పుకోవచ్చు ..
దీనికి తోడు " 6,8,12 స్థానాల్లో ఏ గ్రహం స్థితి పొందకపోతే " గత జన్మ పాప కర్మ " నిశ్శేషంగా పేర్కొనవచ్చు ..
దీనికి యోగాలు పడితే ఏ పుణ్యవిశేషాలతో జన్మ తీసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు ..
వృద్దిలోనికి వచ్చే ప్రతివ్యక్తి , ఏదో శక్తి తనను నడిపిస్తుందని అనుకోవడంలో అర్థం ఇదే కావచ్చును ..
ఏ దానధర్మాలు చేయడంలో పుణ్యం వస్తుందని సాధారణంగా అనుకుంటాము ...
అయితే అన్నిటికంటే మహా విషయం " మనసు " స్వచ్చమైనది కావడం అన్నది పట్టించుకోము ......
కోరిక :
ఏ యుగంలోనైన కూడా అశాంతికి మూలకారణం కోరికే ..
వీలైతే కోరికను జయించాలి లేదా అది తీరేవరకు పోరాడాలి ..