30 August 2015

ప్రభాతే కరదర్శనం :-

దేవాలయాలు :-

మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కాని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటి వెనుకనున్న అంతరార్థ పరమార్థాలేమిటో మనకు అంతా తెలియవు. 

తీర్థ స్నానం :-
ఉదయాన్నే చన్నీటి స్నానం: ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉన్న చన్నీటి స్నానం శుచితోబాటు ఏకాగ్రతను కల్గిస్తుంది. అందులో ఖనిజ సంబంధమైన చన్నీటి స్నానం, అందులో చేసే సూర్యనమస్కారం శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కుంభమేళా మొదలైన పవిత్ర సమయాల్లో పరమయోగులు తీర్థాల్లో, నదుల్లో స్నానం చేస్తారు. కాబట్టి ఆ తీర్థస్నానం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పుష్కర సమయాల్లో తీర్థస్నానం కూడా ఎంతో పవిత్రమైనది.


ప్రదక్షిణం :-
ఆలయం ప్రాకారం లోపల, గర్భగుడికి వెలుపల మూడు ప్రదక్షిణలు చేస్తాం. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం చుట్టూ పరచబడిన రాళ్ళపై వట్టి కాళ్ళతో నడుస్తాం. అలా రాళ్ళపైనున్న సన్నని రంధ్రాలపై అది కాళ్ళ బరువు ఆనుతుంది. ఆ ఒత్తిడికి కాళ్ళలోనున్న నరాల కూడళ్ళు కదిలి, ఇతరావయవాలు చక్కగా పనిచేస్తాయి. దీనినే ఆక్యుపంచర్ అంటారు.


ఆలయంలో కూర్చోవటం :-
దర్శనం తర్వాత ఆలయంలో కూర్చొని వెళ్ళటం ఒక ఆచారం. ఇందుకు కారణం ఆలయంలో అనేక వృక్షాలుంటాయి. వాటికి ఔషధశక్తి ఉంటుంది. కావున ఆ చెట్టుక్రింద గాని, చెట్టుముందుగాని, ఆలయంలో ఎక్కడైన కూర్చొని ధ్యానం చేస్తే ఊపిరితిత్తులను శుభ్రపరిచి, శరీరం పైనున్న విషక్రిములను నాశనం చేసి, శరీరారోగ్యాన్ని కాపాడుతుంది, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతుంది.


జపం :-
ఆలయంలోని వృక్షం క్రింద ఉన్న విగ్రహం ముందు గాని, ఆలయంలో విగ్రహం ముందు గాని కూర్చొని జపం చేస్తుంటాం. అనగా ఉత్తరాభిముఖంగా నుండి ధ్యానం చేసేటప్పుడు, ఉత్తర దిశలోని అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది.


ఆలయ నిర్మాణం :-
ఆలయం నిర్మాణానికి, చక్కటి ప్రకృతి రమణీయ స్థలాన్ని నిర్దేశించి, లోపాలేవి లేని సుక్షేత్రమును ఎన్నుకొని నిర్మిస్తారు. ఆలయంలో వాస్తు, జ్యోతిష్యం, ఆరోగ్యం, సంగీతం, నృత్యం వంటి సర్వశాస్త్ర సమ్మిళితం.


దేవతా విగ్రహాలు :-
ప్రత్యేక ముహూర్తంలో పవిత్రతో, పద్ధతితో మంత్రతో సేకరించబడిన రాళ్ళను విగ్రహాలుగా చెక్కి ఒక సుముహూర్తాన దేవాలయంనందు ప్రతిష్ఠింపబడతాయి. ప్రాణప్రతిష్ఠ జరుపబడిన ఈ దివ్యశిలలు సూర్య, చంద్రుల, వరుణ, వాయువుల ప్రభావాలకులోనై ఖనిజాలుగా మారి విద్యుత్‌శక్తి కలిగి ఇతర దివ్యశక్తులను పొంది, అపూర్వ గుణగణ సంపూర్ణమైనవిగా వెలుస్తాయి.ఈ దివ్య విగ్రహాలనుండి వెలువడే బ్రహ్మపదార్థము, దివ్య పరిమళము, భక్తులు శిరస్సు వంచి చేయబడు ప్రార్థన మూలకంగా మెదడు ద్వారా శరీర ప్రవేశం చేస్తాయి. దేవతా విగ్రహాల నుండి వెలువడే కిరణాలు, ప్రకంపనాలు భక్తుని మనస్సును నిర్మలంగా ఉంచడానికి దోహదపడతాయి. కాని విగ్రహాల క్రింద స్థాపించబడిన యంత్రాలనుండి వెలువడే తరంగాలు మానవుణ్ణి మహోన్నత స్థితికి చేరుస్తాయ.


నమస్కారం :-
భక్తులు ఆలయంలో చేసే నమస్కారాల పద్ధతిలో వ్యాయామం దాగుంది. దీనివలన మెడ, తుంటి, మోచేయి, కాలు, చీలమండలం మొదలైన శరీర భాగాలన్నీ తేలికగా కదిలి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. సాష్టాంగ నమస్కారం సర్వశ్రేయస్కరం, అలాగే వినాయకునికి చేసే గుంజీలు కూడా ఇందులో భాగాలే.


మంత్రం :-
ఆలయంలో అర్చకులు చేసే మంత్ర ఉచ్ఛారణ మనలో చైతన్యాన్ని ప్రకృతిలో శక్తిని పెంపొందిస్తుంది. కొన్ని మంత్రాలు మానవునికి ఆరోగ్యాన్ని, శక్తిని కోరికలను తీరుస్తాయి.


తీర్థం :-
ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్థంలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. వాటిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం, మానసిక, శారీర ప్రశాంతతనిస్తుంది.


ప్రసాదం :-
దైవదర్శనం అనంతరం ఆలయంలో స్వామికి నివేదించిన ప్రసాదాలు తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణకు క్రమబద్ధంచేసి, జీర్ణశక్తిని కలిగిస్తాయి. ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే అక్కడ ఇచ్చే పసుపు నీరు, నిమ్మరసం, విభూతి, కుంకుమ, అభిషేక జలం, మన్ను మొదలైనవి సేవించడం వలన మానసిక రుగ్మతలు అరికట్టబడతాయి.


ఏకాగ్రత :-
దేవాలయంలో చెక్కబడిన మూర్తులు, శిల్పాలు, పురాణగాథలు, ఇతర కథలు ప్రాపంచిక ధోరణినుండి మనసును మరల్చి, మన సంస్కృతీ సాంప్రదాయాల విధులు, విలువలు, విధానాలు మనకు తెలియజేస్తూ, పరిశుభ్రతను, స్వచ్ఛతను, సామాజిక సంబంధ, బాంధవ్యాలను పెంచుతూ మానవతా, ఆధ్యాత్మిక, ఆరోగ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

ఒంటరితనం / వయోభారం :-

ఈ శతాబ్దం మొదట్లో అంటే 2001లో భారతదేశంలో వృద్ధులు ఏడు కోట్ల మంది. మరో ఇరవై సంవత్సరాలకి అంటే 2021 నాటికి సీనియర్ సిటిజన్స్ రెండింతలవుతారని అంచనా. అంటే, ఇంకో ఆరేళ్లలో మన దేశ జనాభాలో పద్నాలుగు కోట్లమంది వయోవృద్ధులే ఉంటారన్నమాట. 

ప్రస్తుతానికి మాత్రం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు వయోవృద్ధులే. ప్రపంచంలో ఆరోగ్య వ్యవస్థ గతంకన్నా మెరుగ్గా ఉండటంవల్ల వృద్ధుల సంఖ్య గణనీయమవుతోంది. జనాభాతోపాటు వీరి ఒంటరితనమూ పెరుగుతోంది. ఈ రోజు శారీరకంగా అనే కాదు మానసికంగానూ, ఉద్రేకపడటం మూలంగాను వయోవృద్ధులలో ఒకవిధమైన నైరాశ్యత నెలకొంది. పిల్లలు దగ్గిర లేకపోవటం అన్నది ఈ వయసువారికి ప్రధాన సమస్య.


సంతానం విదేశాలలో స్థిరపడిపోవటం అన్నది ఈనాటి వృద్ధమూర్తుల బెంగ. దీనే్న మనం ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటుంటాం. అంటే వృద్ధదంపతులు బాహ్యానికి బాగానే కనిపిస్తున్నా అంతరాంతరాలలో శూన్యం నెలకొని ఉంటుంది. అంటే, ఈ ఒంటరితనంతో ఇంకా బ్రతికి ప్రయోజనం ఏమిటి? అన్న నైరాశ్యత. లంకంత ఇంట్లో వేధించే ఒంటరితనానికి పత్రికలు, న్యూస్‌పేపర్లు, టీవీ షోలు-ఇవేనా సమాధానాలు?

కొందరి పిల్లలైతే స్వదేశంలోనే ఉంటారు. కానీ ఉద్యోగాల పేరిట ఏయే రాష్ట్రాలలోనో ఉంటుంటారు. 

చుట్టపుచూపుగా తల్లిదండ్రుల్ని వచ్చి చూసి పోతుంటారు. మరికొన్ని కుటుంబాల సంతానమైతే ఒకేచోట ఉన్నా ‘తమకు కావలసిన స్పేస్ ఉండటంలేదని, ప్రైవసీ ఉండటంలేదని, తమకు స్వేచ్ఛ లేదని, తాము స్వతంత్రంగా తమకిష్టమైన రీతిన ఉండలేకపోతున్నామని అనటం మనం చూస్తున్నాం, వింటున్నాం.
ఇవేవీ కాదనలేని కారణాలు కాదు. రెండు తరాల మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేకపోవడంతో కుటుంబ వ్యవస్థ బద్ధలైపోతోంది. ఫలితంగా వయోవృద్ధులకు ఒంటరితనం తప్పటంలేదు. తమ ఆలోచనలను పంచుకునే ఆత్మీయులు దగ్గిర లేకపోవటం, తమను భౌతికంగానే కాదు మానసికంగాను అక్కున చేర్చుకునే సంతానం పట్టనట్టు ఊరుకోవటం, తమ నిత్య వ్యవహారాలను చూసుకునే శక్తి తమలో తగ్గిపోతుండటం- కనీసం పనివారితోనైనా కాలక్షేపం చేద్దామనుకుంటే వారూ కరువైపోతుండటం- సీనియర్ సిటిజన్స్‌ను కృంగదీస్తున్న సమస్యలు.

కొందరు వృద్ధులు ఎంతలా వయసు పైబడుతున్నా ఇంకా గతంలోనే జీవిస్తుంటారు. అంటే ఇంకా గత వైభవానే్న ఆశిస్తుంటారు. ఆ అధికార దర్పం నుండి బయటపడరు. పైగా తమ మాటనే నెగ్గాలనుకుంటారు. ఈ నేపథ్యంలో అదృశ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఆక్సిడెంట్స్ జరిగిపోతుంటాయి. రెండు తరాలమధ్య అంతరాలు పెరిగిపోతుంటాయి. పలుకే బంగారమయిపోతుంటుంది. వయోవృద్ధులు తమ స్పేస్‌లో తాము ఉంటుంటే తరువాతి తరం తమ స్పేస్ తమకు ఉండాలంటూ జాగ్రత్తపడుతుంటారు.
తొలితరం తమ గతంనుండి తప్పుకోలేక మలి తరాన్ని లెక్కించకపోవటమూ జరుగుతుంటుంది. అందుకే మలితరం తొలి తరం నుండి తప్పుకుంటుంటుంది. ఫలితంగా తొలితరానికి ఒంటరితనం తప్పటంలేదు. దీన్ని జీర్ణం చేసుకోలేక ‘టు బి ఫర్‌గాటన్ బై ఎవ్విరిబడి ఈజ్ వర్స్ దేన్ డెత్’ అని అనుకుంటుంటారు. దీంతో వయసు మీరుతున్నకొద్దీ బ్రతుకు మరింత భారం అవుతుంటుంది.

మరో కోణం :-
‘స్టేయింగ్ ఎలోన్’ అంటే ఒంటరితనం కాదు.. వొంటరిగా ఉండటం. ఒంటరితనం మీదపడ్డదైతే వొంటరిగా ఉండటం ఏరికోరి ఆహ్వానించింది. దీనికి కారణం స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండాలనుకోవటం. ఈ నిర్ణయానికి వచ్చిన సీనియర్ సిటిజన్స్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సంసిద్ధమై ఉంటారు. ఒక విధంగా తమ కుటుంబాలకు, తమ పిల్లలకు భారం కాకూడదన్న నిర్ణయమూ ఈ వొంటరితనాన్ని అభిలషించటానికి ఒక కారణమే... కాదనలేని వాస్తవం.
ఏది ఏమైనప్పటికీ వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటూ తమ స్వేచ్ఛను, తమ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తూ ఆనందించటం ఒక విధంగా మంచి పరిణామమే.. ఒక విధంగా వయసుతో పాటు పెరిగిన మెచూరిటీగానే చెప్పుకోవచ్చు. మొత్తానికి తమ కిష్టమైన రీతిన జీవించాలన్న మనస్తత్వం ఈ ఉద్దేశాల నేపథ్యం. దీనే్న ‘ట్రైయింగ్ టు లివ్ ఇన్ దైర్ ఓన్ టర్మ్స్’ అని చెప్పుకోవచ్చు.


ఆమధ్య ఒంటరిగా ఉంటున్న ఎనభై ఏళ్ళ వృద్ధురాల్ని కలిసినపుడు అడిగారు :- ‘‘ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?’’ అని. ఆమె తడుముకోకుండా ‘‘మహా అయితే ఏమవుతుంది. పోతాను, అంతే కదా. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. దాని గురించి ఇప్పట్నించే బెంగపడటం ఎందుకు?’’ అంది. ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని, నిజం చెప్పొద్దూ, సమకాలీన వ్యవస్థలో సన్యసించాం, మహాత్ములమైపోయాం అని చెప్పుకునే ఆధ్యాత్మికపరులలో సైతం చూడలేదు. నిజమే కదా- చావుకు భయపడుతున్నంతకాలం అడుగు తీసి అడుగువేయాలన్నా చావుకొస్తుంటుంది. మృత్యువు భయంతో బ్రతుకు సాగించేవారికి తాడూ పాములాగే భయపెడుతుంటుంది. వీరికి ప్రతిదీ అన్‌టువార్డ్ ఇన్‌సిడెంట్‌గానే కనిపిస్తుంటుంది.

ఈ నేపథ్యంలోనే మరో వృద్ధ జంట గురించి చెప్పుకోవాలి. వీరు ఏడు పదులలోనివారే. ఒకరికి ఒకరు తోడు. అయినా ఒకలాంటి డిప్రెషన్. పిల్లలు దగ్గిర లేరే అని బాధ. ఎప్పుడూ ఏదో అసంతృప్తి. పెద్దవారు కదా అని బంధువర్గంలోని వారు ఎవరో ఒకరు వచ్చి - చూసి- పలకరించి పోతుంటారు. ఇరుగువారు పొరుగువారు సాయంత్రాలు పలకరిస్తూనే ఉంటారు. అయినా ప్రతి దినాన్ని భయం భయంగానే గడుపుతుంటారు. నిజానికి ఇటువంటివారి విషయంలోనే అన్‌టువార్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఏ జ్వరమో, జలుబో నెలకొకసారి పలకరిస్తూ భయపెడుతుంటుంది. అందుకే ఎంతలా దేవుళ్ళకు మొక్కుతున్నా ఆ దేవతలు సైతం వీరికి సహాయం చేయటానికి భయపడుతుటారు. కారణం వీరు పూజలు సైతం భయంతోనే చేస్తుంటారు కాబట్టి.

వీరిని కలిసినప్పుడు ఉండబట్టలేక అడిగారు :- ‘‘మీరు మీ పిల్లలు దగ్గర లేరని.. పిల్లల్ని కనీ ఒంటరిగా ఉండాల్సి వస్తోందని అనుకుంటున్నారు కదా.. మరి మీరు మాత్రం మీ తల్లిదండ్రుల్ని వదిలి వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు చేయలేదా’’ అని. సమాధానం చెప్పటానికి బదులు మామ్మగారు ఏదోపని ఉన్నట్లు వంటింట్లోకి జారుకున్నారు. ముందున్న పెద్దాయన పేపర్లోకి తలదూర్చి ఓ ఐదు నిమిషాల తర్వాత టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం ప్రారంభించారు.

మొదటి వృద్ధ మహిళ ఎంతో తృప్తిగా ‘ప్రతీగంటకీ ఎవరో ఒకరు వచ్చి అమ్మగారూ అంటూ పలకరిస్తుంటారు. ఆ పలకరింపు నాకెంతో ధైర్యాన్నిస్తుంటుంది. చుట్టుప్రక్కలనున్న వంద గడపలవారూ నాకూ ఆత్మీయులే.. నావారే.. బంధుజనం అందుబాటులో లేకపోయినా ఈ వందమంది పలకరింపులే నాకు వందేళ్ళ ఆయుష్షు’ అంటుంటే ఆమె నిర్భయత్వానికి, సడలని ఆత్మస్థైర్యానికి, పాజిటివ్ ఆటిట్యూడ్‌కి ‘హాట్సాఫ్’ అనుకుంటూ వినమ్రంగా మనసులో నమస్కరించాను.

రీసెంట్‌గా ఒక బంధువు ఇంటికి వెళ్లాను-ఆ కుటుంబంతో బంధుత్వాన్ని మించిన స్నేహం నాది. ఆ డెబ్భై ఏడేళ్ళ పెద్దాయనని బాబాయ్ అని పలకరిస్తున్నా మిత్రుడితో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతుంటాను. ఇంతకీ అసలు విషయం నేను వెళ్లేటప్పటికి వృద్ధదంపతులిద్దరూ ఇంట్లో కొడుకు కోడలు ఉద్యోగాలికి ఉదయం తొమ్మిదింటికే వెళ్లిపోయారు.. మనవడు కాలేజీకి, మనవరాలు స్కూల్‌కి. మొత్తానికి పిన్ని మా ఇద్దరికీ వడ్డించింది. ఇంతలో మనవరాలు స్కూల్ నుండి వస్తే ఆ అమ్మాయికి మరీ కలిపి తినిపించింది. ఆ తర్వాత కానీ తాను తినలేదు.

ఊరుకోక ‘‘ఎందుకు పిన్నీ, పాపకు కలిపిపెట్టడం... తన కలుపుకు తినగలదు కదా’’ అని అంటే, వెంటనే ‘నేనూ బాబాయ్ ఉద్యోగాలకెళ్తే ఇంట్లో ఉన్న పిల్లలకి కలిపి పెట్టాలనే ధ్యాస.. కనీసం వడ్డించాలనే ధ్యాస... ఇంట్లో ఉన్న పెద్దలకి ఉండేదికాదు. నాకేమో నా పిల్లలకి దగ్గరుండి పెట్టలేకపోతున్నాననే అన్న బాధ వేధిస్తుండేది. కానీ నేను కూడా ఉద్యోగం చేస్తేకానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాగే బాబాయ్‌కి మధ్యాహ్నాలప్పుడు నేనుదగ్గరుండి కడుపారా పెట్టలేకపోయేదాన్ని. అందుకే ఇప్పుడు ఓపిక లేకపోయినా మనస్ఫూర్తిగా ప్రతీ పని చేస్తున్నా.. నాలా నా కోడలు ఉద్యోగం చేస్తోంది కదా. తనకూ తన పిల్లల్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే బాధ ఉంటుంది కదా. అందుకే నేను పడ్డ బాధ నా కోడలు పడకూడదని నేననుకుంటా’’ అంది.




 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకెళ్తూ ఏదో సుఖపడిపోతున్నారన్న భ్రమల నుండి తొలగి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగితే ఉమ్మడి కుటుంబాలలో రాద్ధాంతాలు తగ్గి, ఏడుపులు పెడబొబ్బలు తగ్గి కళకళలాడుతూ ఉండవచ్చు. సరిగ్గా అర్థం చేసుకోలేక, అనవసరమైన అహంకారాలకి పోయి, అయినదానికీ కానిదానికీ భూతద్దంలో చూస్తూ భూతంలా భ్రమిస్తుండటంవల్లనే కదా జాయింట్ ఫామిలీస్ న్యూక్లియర్ ఫామిలీస్‌గా విడివడిపోతోంది.

అసలు, ఏ తరం స్పేస్‌లో ఆ తరం ఉండగలిగితే స్వేచ్ఛ పేరిట, ప్రైవసీ పేరిట ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. మైండ్ కల్చర్, వర్క్ కల్చర్‌లకు సరైన అర్థాలు తెలిస్తే కనుక ప్రతీ కుటుంబమూ స్వర్గ్ధామమే అవుతుంది.


రథసప్తమి :-

కాలః పచతి భూతాని
కాలం సంహరతే ప్రజాః
కాలః సుప్తేషు జాగ్రర్తి
కాలోహి దురతిక్రమః


కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది. కాలమే సర్వప్రాణులను సంహరిస్తుంది. లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది, సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది. అందుకే కాలధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు.

విత్తు మొలకెత్తటానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడగటానికి, మొగ్గ పుష్పంలా వికసించటానికి, పువ్వు కాయగా మారటానికి, కాయ పండుగా మారటానికి, కాలమే కారణం.
కాలం మహా వేగవంతమైనది. దానికి పురోగమనమేకానీ, తిరోగమనమే లేదు. అట్టి కాలం యొక్క వేగాన్ని తెలుసుకోవడం ఎలా?

సూర్య గమనమే కాలవేగానికి ప్రమాణం. సూర్యునకు కూడా పురోగమనమేకానీ, తిరోగమనం లేదు. ఆయన వేసే ప్రతి అడుగు కాలవేగానికి, కాలగమనానికి కొలబద్ద.

ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.


కాలమే వేదస్వరూపం అంటుంది వేదం. కాలం కంటికి కనబడదు. దైవమూ కంటికి కనబడడు. కానీ కాలానికి ప్రమాణమైన సూర్యుడు మన చర్మ చక్షువులకు కనిపిస్తాడు. అందుకే ఆయనకు ప్రత్యక్షదైవంలాగా కొలుస్తాము, ఆడి నారాయణుడిగా ఆరాధిస్తాము.

భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే.
సూర్యుని వలెనే ఈ సమస్త ప్రకృతి చైతన్యవంతం అవుతుంది, తేజోవంతమవుతుంది. ప్రాణవంత మవుతుంది. ఆరోగ్యవంత మౌతుంది, అందుకే -


సప్తాశ్వరాధ మారూఢం
ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధారం దేవం
టం సూర్యం ప్రణమామ్యహం.


ఏడు గుఱ్ఱాలు పూన్చిన రథాన్ని అధిరోహించి, నిరంతర సంచారం చేసే కశ్యపాత్మజుడైన సూర్యునకు నమస్కారం, అని ఉభయ సంధ్యలోనూ, ఆయనను స్తుతిస్తాము.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||


ఎఱ్ఱని దాసాని పువ్వు రంగువంటి శరీరకాంతితో, ప్రకాశించేవాడూ, కశ్యపుని కుమారుడు, మహా కాంతివంతుడు, చీకటిని తొలగించేవాడు అయిన సూర్యునకు నమస్కారము, అని పురాణాలు ప్రవచిస్తాయి.

ఇంతకీ ఈ సూర్యుడు ఎవరు? అతని తల్లిదండ్రులెవరు? ఎప్పుడు జన్మించాడు?
ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలక్రితం జరిగిన పెద్ద విస్ఫోటనం కారణంగా ఈ ఖగోళాలన్న ఏర్పడ్డాయని "బిగ్ బ్యాంగ్'' థియరీ చెప్తుంది. కానీ ఆ విస్ఫోటనానికి కారణం ఏమిటన్నది ఏ సైన్సు యింతవరకు వివరించలేదు.


ఓంకార విస్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడిందని, ఆ కాంతియే సూర్యుడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
నిజానికి సూర్యుడు భగభగ మండే అగ్నిగోళం మాత్రమే. ఆ గోళానికి అధిపతి మార్తాండుడు. ఆయన తల్లిదండ్రులే ఆదితి, కష్యపులు. సూర్యగోళానికి అధిపతి కనుక ఆయన సూర్యుడయ్యాడు. మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యుడు జన్మించాడు. సూర్యరథాన్ని ఆధారం చేసుకుని తక్కిన గ్రహాలన్నీ సంచరిస్తాయి. సూర్య జననమే లేకపోతే తక్కిన గ్రహాలకు గమనమే లేదు. పండుగ చేసుకోవడం, సూర్యుడిని ఆరాధించడం ఆచారమైంది.

ఈ విశ్వం ఒక వృత్తమైతే, దానికి 360 డిగ్రీలు వుంటాయని, సంఖ్యాశాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున చరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అదే మనకొక సంవత్సరం. అందుకే జోతిష శాస్త్రవేత్తలు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, ఈ బ్రహ్మాండంలో యింకా 11 మంది సూర్యులు వున్నట్లు ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే మన ప్రాచీన ఋషులు ఎప్పుడో ఈ ద్వాదశాదిత్యులను గుర్తించి పురాణాల ద్వారా పరిచయం చేశారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు.

ఈ ద్వాదశాదిత్యులే సంవత్సరాత్మకమైన కాల విభాగంలోని ద్వాదశామాసాలకూ ఆధిదేవతలుగా పేర్కొనబడినారు. రాశులు కూడా ఇందువల్లనే 12గా ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు.
మా + అఘ = పాపం లేనిది.

పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ మాసాన్ని (మాఖ)మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైనా, ఈ రథసప్తమి నుండి ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం అనే గ్రహణం నుండి సూర్యుడు విముక్తుడై ఈ రథసప్తమి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కనుక ఈ రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృతర్పణాలు, దేవ ఋషి తర్పణాలు ఇవ్వాలనే నియమాన్ని పెద్దలు నిర్ణయించారు. ఉత్తరాయణం, మాఘమాసం, రథసప్తమి మానవుణ్ణి ఉన్నతజ్ఞాన మార్గంలో ప్రయాణింపజేసి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి ప్రాత్రుణ్ణి చేస్తాయి.
"సూర్య ఆత్మా జగత స్తస్దుషశ్చ''

మన సౌరకుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కనుక సూర్యోపాసన చేస్తే (అరుణం) ఋణ, రోగ, శతృబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఇకటిగా పేర్కొనే "యోపాం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి'' అనే వాక్యాలున్న మంత్రం అరుణం లోనిదే.

సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధిమంతుడు అవుతాడు.
"ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్''

సూర్యకాంతిలోని నీలికిరణాల ప్రభావం వల్లనే మన శరీరం సహజసిద్ధంగా విటమిన్ 'డి'ని ఉత్పత్తి చేసుకొంటుంది. 'డి' విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. సూర్యకిరణ జన్యసంయోగం వల్లనే సృష్టి, ఆహారం, పోషణ మున్నగునవి ఏర్పడుతున్నాయి. సూర్యకిరణాలు మానవశరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రధానం, మున్నగు ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.

జ్యోతిశ్శాస్త్రం "ఆత్మ ప్రభావశక్తిశ్చ పితృచింతారవే:ఫలం'' అని సూర్యగ్రహ ఫలితాన్ని చెప్పింది. సూర్యోపాసనవల్ల, సూర్యగ్రహ ప్రభావంవల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్రశక్తి పెరుగుదలకూ, హృద్యోగనివారణకూ సూర్యుడే ఆరాధ్యుడు. మేషరాశిలో సూర్యుడు ఉండగా జన్మించే వారందరూ ఆత్మప్రభావాధికులుగా ఉంటారని జ్యోతిష్యజ్ఞులు చెప్తారు.

సూర్యుణ్ణి "సప్తాశ్వుడు'', 'సప్తసప్తి' అన్నారు కదా!


సూర్యకిరణకాంతిలో ఏడురంగులు ఉంటాయి. ఆ కాంతి వర్ణాలనే ఏడు గుఱ్ఱాలుగా పేర్కొన్నారు. వాస్తవానికి "వేగం'' అనేది ఒక్కటే సూర్యుని గుఱ్ఱం. ఆ గుఱ్ఱం పేరే 'సప్త' అనగా కాంతికిరణ గమన వేగం ఒక్కటే ఏడుగా వర్ణాలుగా గోచరిస్తుంది. స్థూలదృష్టికి కాంతి కిరణం ఏడురంగులలో గోచరించినా, అతనీలలోహితాది కిరణాలు కోట్లకొలది ఉన్నాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అశ్వాలు అంటే కిరణాలే. "తస్మో దశ్వా అజాయత'' అని వేదం చెప్పింది. సృష్టి యజ్ఞంలో మొదట ఏర్పడింది అశ్వమే. కనుక ఆ ఆశ్వాలే సూర్యుని కిరణాలు. సూర్యుడంటే "కిరణాలనూ, ప్రాణశక్తుల్ని, జలములందలి రసాన్ని స్వీకరించేవాడు, ఆకాశంలో సంచరించువాడు, లోకాన్ని సృష్టించువాడు, ప్రాణుల్ని కర్మలకు ప్రేరేపించువాడు, అని అర్థం.

"సూర్యా ద్భవంతి భూ తాని,
సూర్యేణ పాళీ తానిచ
సూర్యే లయం ప్రాప్నువంతి
య సూర్యః సోహ మేవచ''


సృష్టి, స్థితిలయాలు సూర్యుని వల్లనే జరుగుతున్నాయని సూర్యోపనిషత్తు సూచించింది.
సుప్రసిద్ధమైన గాయత్రీమంత్రం సూర్యపరమైనదే వేదాల్లోని సౌరసూక్తాలూ, రామాయణంలోని ఆదిత్యహృదయం, సూర్యారాధన యొక్క ప్రాచీనతను సూచిస్తున్నాయి. సూర్యోపాసనతో అనేక లాభాలు పొందినవారున్నారు. అగస్త్యుడు బోధించిన 'ఆదిర్యహ్ర్య్దయం' ప్రభావంతోనే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించగల్గాడు. మయూరుడు సూర్యానుగ్రహంతో కుష్ఠురోగ విముక్తుడయినాడు. సూర్యానుగ్రహంతోనే పాండవులు "అక్షయపాత్ర'' పొంది అరణ్యవాసకాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలు చేస్తూ, ధన్యులయ్యారు.


సూర్యరథానికి ఒక్కటే చక్రం. దానికి ఆకులు ఆరు. గుఱ్ఱాలు ఏడు. అసూరుడు సారథి. కాంతులు విరజిమ్ముతూ, నిరంతరం ప్రయాణించడం, అతని గుణం. ఇది సూర్యుని భౌతిక స్వరూపం. కాళాత్మకంగా పరిశీలిస్తే సూర్యునికి సంవత్సరమనేదే చక్రం. విశ్వమే రథం. ఛందస్సులే (వేదాలు) గుఱ్ఱాలు. ఆరు ఋతువులే ఆరు ఆకులు. వ్యక్తిపరంగా ఆలోచిస్తే శరీరమే రథం. జ్ఞానమే చక్రం. కామ, క్రోధాది అరిషడ్ వర్గాలే ఆరు ఆకులు, శుభేచ్చ, విచారణ, తను మానసి, సత్త్వాపత్తి, సంసక్తి, పదార్థ భావన, తురీయము అను సప్తజ్ఞాన భూమికలే ఏడు గుఱ్ఱాలు. మనస్సే పగ్గాలు. బుద్ధియే సారథి అయిన అసూరుడు. పరమాత్మయే సూర్యుడు. హృదయమే పరమాత్మ కూర్చుండు పీఠం. జీవుని ప్రయాణ సాధనం శరీరం. ఇదే సూర్యరథం. సమిష్టిపరంగా పరిశీలిస్తే, విశ్వమే రథం. కాలమే చక్రం. ఉత్పత్తి, స్థితి, పరిణామం, వృద్ధి, క్షయం, నాశనం, అను షడ్భావ వికారాలే ఆరు ఆకులు. దేవ, మానవ, వృక్ష, మృగ, పక్షి, కీటక, జలచరములనే సప్త జన్మలు, సప్తాశ్వాలు. పరమాత్మయే సూర్యుడు. మనస్తత్వమే పగ్గాలు. బుద్ధితత్వమే సారథి అయిన అసూరుడు. ఇదే కాలవరణంతో కూడిన విశ్వాత్మక సృష్టి యొక్క సమిష్టి స్వరూపం.
యోగశాస్త్ర దృష్టితో పరిశీలిస్తే శరీరమే రథం, కుండలినీశక్తియే ఏకచక్రం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, అనే షడ్చక్రాలే ఆరు ఆకులు. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, మహత్తు, అహంకారం అనే సప్తావరణాలే సప్తాశ్వాలు. చిదాత్మయే సూర్యుడు. కుండలినీ శక్తి యొక్క సంచారమే సూర్యుని సంచారం.

కనుకనే ఇడాపింగళ మార్గద్వయంలో సంచరిస్తూ, సుఘమ్నాస్థానంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఈ దేహాన్ని తేజోవంతం చేసే ఈ సూర్యుడు మనకు ఆరాధ్య దైవమైనాడు. ఆయన జన్మదినమైన 'రథసప్తమి' మనకు పండుగ అయింది. "సూర్యజయంతి'' అయిన ఈ రథసప్తమినాడు బంగారం, వెండి, రాగి, ఇనుము, వీనిలో ఏదైనా ఒకదానితో చేసిన దీపప్రమిదలో నూనె, నెయ్యి, ఆముదం, విప్పనూనె, నువ్వులనూనెతో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకుని, నదీతీరానికి కానీ, చెరువుల వద్దకు కానీ, వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్ళలో వదిలి, ఎవ్వరూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులలో ఏడు రేగుపండ్లు తలపై పెట్టుకుని చేయాలి. రుద్రాక్ష, జిల్లేడు, రేగు, చెట్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షజాతులు. ఏడాదికి ఒక్కసారైనా ఈ ఔషధాలను తాకినా, వాటి స్పర్శా ప్రభావం ఆ సంవత్సరమంతా శరీరంపై ఉంటుందనీ, ఈ పండుగనాడు వీటితో తప్పక శిరఃస్నానం చేయాలని పెద్దలు నిర్ణయించారు. వైవస్వతాది మన్వంతరాలలో వైవస్వతుడు ఏడవ మనువు. సూర్యుడు వివస్వంతుడు. వైవస్వతుని కొడుకు కనుకనే వైవస్వతుడు ఇప్పటి మన్వంతరమైన వైవస్వత మన్వంతరానికి రథసప్తమియే సంవత్సరాది. అనగా ఉగాది. ఈ రథసప్తమినాడు సూర్యోదయ కాలంలో నక్షత్రాలున్న సప్తమీ దినం కనుక "రథసప్తమే'' అని అంటారు. కనుక ఈ రథసప్తమి మానవాళికి పర్వదినమైంది. పితృదేవతలకు ప్రీతికరమైనది. కనుక ఈనాడు మకర సంక్రాంతి వలెనే చక్కర పొంగలి చేసి, సూర్యునికి నివేదన యిచ్చి, పండుగ చేసుకోవాలి. పితృదేవతలకు తర్పణాలు యిచ్చి సంతోషం కల్గించాలి.

ఈ సూర్యారాధనతో మానవాళి సర్వపాప విముక్తులై, శాశ్వత పుణ్యలోకాలు పొందాలి అని ఆశిద్దాం.

సూర్యగ్రహణతుల్యా సాశుక్లా మాఘస్య సప్తమీ
అరుణోదయ వెలాయాం స్నానం తత్ర మహాఫలం
మాఘమాసి సితేపక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్వాత్ స్నానార్ఘ్యదానాభ్యమాయు ఆరోగ్యసంపదః''


లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం :-

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.

మనసుతో పలకాలి :-
లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.

భవానీమాతే లలితాదేవి :-
ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామం త్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి.  

శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.

183 శ్లోకములలో చెప్పబడినది:-

ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.
లలితా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి ఈరోజుల్లో ఇంటింటా నిత్యపారాయణగా జరుపబడుతోంది. లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కరరాయులు మొదటి శ్లోకంగా శ్రీలలితను ప్రార్థించాడు. సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీమహారాజ్ఞిగా కొనియాడబడింది. పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి, చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత.
 
ల – సర్వవిద్యలకు లక్ష్యమైనది,
లి – రూపము లేనిది,
త – సంసారం నుండి తరింపజేయునది, శ్రీలలిత.


శోభ, విలాసం,మాధుర్యం, గాంభీర్యం, స్థైర్యం, జేజం,అర్థం ” లాలిత్యం, ఔదార్యం – ఈ 8 పదాల “లలిత” పదములలో నిక్షిప్తం. చెరకుగడ ధనస్సుగా, కుసుమాలను అస్త్ర, బాణాలుగా ధరించి, ఉత్తమగుణాలు కలిగి, గణాతీతమైనది శ్రీలలిత. పంచబ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ సేవిస్తుంటారు.పంచ బ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం, చిత్క ళాసనం, వర్నాసనం – 10 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధిపతిన లలిత శ్రీమహారాజ్ఞి. బ్రహ్మాండమే ఆమె మహా సామ్రాజ్యము. ఆ తల్లి రెప్పపాటులో కాలం పుట్టింది. విశ్వమంతా తానే అయి వృద్ధిక్షయాలు లేని పూర్ణస్వరూపం లలిత. అమ్మ చేతి గోళ్ళ నుండి దశావతారాలు ఆవిర్భావించాయట. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి, త్రిపుర సుందరగా కొలువబడుతోంది. సుషుప్తనాడులలోని శక్తి కనుక త్రిపురసుందరి. మనః, బుద్ధి, చిత్తాలలో వశించునది కనుక త్రిపురసుందరి.

విశ్వమంతా త్రితత్త్వాత్మికం. అందులో శక్తి కనుక త్రిపురసుందరి. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు దూర్వాసుడు – ఈ 12 మంది మహానీయుల పూజలందుకొంటున్న మహాపూజ్య. ఆ తల్లికి 64 కళలూ ఉపచారాలే. 64 కోట్ల యోగినీగణంచే సేవింపబడు నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం – ఈ 5 ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచతన్మాత్రలు. ఈ ఐదు తనన్మాత్రాలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి.

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం :-

ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || ౧ ||

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా || ౨ ||

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా || ౩ ||

చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా || ౪ ||

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా || ౫ ||

వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా || ౬ ||

నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా || ౭ ||

కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా || ౮ ||

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా || ౯ ||

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా || ౧౦ ||

నిజసంలాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ |
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా || ౧౧ ||

అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా |
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా || ౧౨ ||

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా || ౧౩ ||

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ |
నాభ్యాలవాలరోమాలిలతాఫలకుచద్వయీ || ౧౪ ||

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |
స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా || ౧౫ ||

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా || ౧౬ ||

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా |
మాణిక్యముకుటాకారజానుద్వయవిరాజితా || ౧౭ ||

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా || ౧౮ ||

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా |
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా || ౧౯ ||

సింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా |
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః || ౨౦ ||

సర్వారుణాzనవద్యాంగీ సర్వాభరణభూషితా |
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా || ౨౧ ||

సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా |
చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా || ౨౨ ||

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ |
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ || ౨౩ ||

దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా |
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా || ౨౪ ||

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా || ౨౫ ||

చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా |
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా || ౨౬ ||

కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా |
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా || ౨౭ ||

భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా |
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా || ౨౮ ||

భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా |
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా || ౨౯ ||

విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా |
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా || ౩౦ ||

మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ || ౩౧ ||

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా || ౩౨ ||

కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా |
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా || ౩౩ ||

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా || ౩౪ ||

కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ || ౩౫ ||

మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా |
కులామృతైకరసికా కులసంకేతపాలినీ || ౩౬ ||

కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ |
అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా || ౩౭ ||

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ || ౩౮ ||

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ || ౩౯ ||

తటిల్లతాసమరుచిః షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ || ౪౦ ||

భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా |
భద్రప్రియా భద్రమూర్తి-ర్భక్తసౌభాగ్యదాయినీ || ౪౧ ||

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా |
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ || ౪౨ ||

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా || ౪౩ ||

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా |
నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా || ౪౪ ||

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా |
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా || ౪౫ ||

నిష్కారణా నిష్కళంకా నిరుపాధి-ర్నిరీశ్వరా |
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ || ౪౬ ||

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ |
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ || ౪౭ ||

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ |
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ || ౪౮ ||

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ |
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా || ౪౯ ||

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా |
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా || ౫౦ ||

దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా |
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా || ౫౧ ||

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా |
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ || ౫౨ ||

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ |
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ-ర్మృడప్రియా || ౫౩ ||

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ |
మహామాయా మహాసత్త్వా మహాశక్తి-ర్మహారతిః || ౫౪ ||

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
మహాబుద్ధి-ర్మహాసిద్ధి-ర్మహాయోగీశ్వరేశ్వరీ || ౫౫ ||

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా |
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా || ౫౬ ||

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ || ౫౭ ||

చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికలామయీ |
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా || ౫౮ ||

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా |
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా || ౫౯ ||

చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా || ౬౦ ||

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ || ౬౧ ||

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా || ౬౨ ||

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా |
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ || ౬౩ ||

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |
సదాశివాzనుగ్రహదా పంచకృత్యపరాయణా || ౬౪ ||

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ |
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ || ౬౫ ||

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ || ౬౬ ||

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా || ౬౭ ||

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూలికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా || ౬౮ ||

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |
అంబికాzనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా || ౬౯ ||

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా || ౭౦ ||

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా || ౭౧ ||

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా || ౭౨ ||

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా |
కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా || ౭౩ ||

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా |
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా || ౭౪ ||

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ || ౭౫ ||

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా || ౭౬ ||

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ || ౭౭ ||

భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ |
సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా || ౭౮ ||

తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోzపహా || ౭౯ ||

చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః || ౮౦ ||

పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా || ౮౧ ||

కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |
శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా || ౮౨ ||

ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా || ౮౩ ||

సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా || ౮౪ ||

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ || ౮౫ ||

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ |
మూలప్రకృతి-రవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ || ౮౬ ||

వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ || ౮౭ ||

భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ శివారాధ్యా శివమూర్తిః శివంకరీ || ౮౮ ||

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా || ౮౯ ||

చిచ్ఛక్తి-శ్చేతనారూపా జడశక్తి-ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతిః సంధ్యా ద్విజబృందనిషేవితా || ౯౦ ||

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ || ౯౧ ||

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా || ౯౨ ||

కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ |
కులకుండాలయా కౌళమార్గతత్పరసేవితా || ౯౩ ||

కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః |
శాంతిః స్వస్తిమతీ కాంతి-ర్నందినీ విఘ్ననాశినీ || ౯౪ ||

తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ || ౯౫ ||

సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ || ౯౬ ||

వజ్రేశ్వరీ వామదేవీ వయోzవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ || ౯౭ ||

విశుద్ధిచక్రనిలయాzzరక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా || ౯౮ ||

పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా డాకినీశ్వరీ || ౯౯ ||

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాzక్షమాలాదిధరా రుధిరసంస్థితా || ౧౦౦ ||

కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా రాకిణ్యంబాస్వరూపిణీ || ౧౦౧ ||

మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా || ౧౦౨ ||

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ || ౧౦౩ ||

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాzతిగర్వితా || ౧౦౪ ||

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ || ౧౦౫ ||

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాzస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా || ౧౦౬ ||

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా || ౧౦౭ ||

మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ || ౧౦౮ ||

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ || ౧౦౯ ||

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా స్వధాzమతి-ర్మేధా శ్రుతిః స్మృతి-రనుత్తమా || ౧౧౦ ||

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా || ౧౧౧ ||

విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ || ౧౧౨ ||

అగ్రగణ్యాzచింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా || ౧౧౩ ||

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ || ౧౧౪ ||

నిత్యతృప్తా భక్తనిధి-ర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ || ౧౧౫ ||

పరాశక్తిః పరా నిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ |
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ || ౧౧౬ ||

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా |
మహనీయా దయామూర్తి-ర్మహాసామ్రాజ్యశాలినీ || ౧౧౭ ||

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా || ౧౧౮ ||

కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరఃస్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుఃప్రభా || ౧౧౯ ||

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ || ౧౨౦ ||

దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి-ర్గుణనిధి-ర్గోమాతా గుహజన్మభూః || ౧౨౧ ||

దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || ౧౨౨ ||

కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || ౧౨౩ ||

ఆదిశక్తి-రమేయాzzత్మా పరమా పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా || ౧౨౪ ||

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ |
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి-స్త్రిదశేశ్వరీ || ౧౨౫ ||

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా |
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా || ౧౨౬ ||

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాzపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా || ౧౨౭ ||

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లప్తబ్రహ్మాండమండలా || ౧౨౮ ||

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా || ౧౨౯ ||

ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || ౧౩౦ ||

అష్టమూర్తి-రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా || ౧౩౧ ||

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా || ౧౩౨ ||

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతిః || ౧౩౩ ||

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా || ౧౩౪ ||

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా || ౧౩౫ ||

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ || ౧౩౬ ||

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ |
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ || ౧౩౭ ||

సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ || ౧౩౮ ||

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ |
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా || ౧౩౯ ||

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ || ౧౪౦ ||

చిత్కళాzzనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ || ౧౪౧ ||

మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా || ౧౪౨ ||

భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా || ౧౪౩ ||

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోళి-ర్మృత్యుదారుకుఠారికా || ౧౪౪ ||

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |
అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ || ౧౪౫ ||

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా || ౧౪౬ ||

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా || ౧౪౭ ||

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా || ౧౪౮ ||

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ || ౧౪౯ ||

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా || ౧౫౦ ||

సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా |
కపర్దినీ కళామాలా కామధు-క్కామరూపిణీ || ౧౫౧ ||

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః |
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా || ౧౫౨ ||

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ || ౧౫౩ ||

మూర్తాzమూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా |
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ || ౧౫౪ ||

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా |
ప్రసవిత్రీ ప్రచండాzzజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః || ౧౫౫ ||

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః || ౧౫౬ ||

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ || ౧౫౭ ||

ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ |
ఉదారకీర్తి-రుద్దామవైభవా వర్ణరూపిణీ || ౧౫౮ ||

జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా || ౧౫౯ ||

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా |
కల్పనారహితా కాష్ఠాzకాంతా కాంతార్ధవిగ్రహా || ౧౬౦ ||

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా |
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ || ౧౬౧ ||

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా || ౧౬౨ ||

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ |
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః || ౧౬౩ ||

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ || ౧౬౪ ||

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ |
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ || ౧౬౫ ||

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోని-ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ || ౧౬౬ ||

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ |
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా || ౧౬౭ ||

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ || ౧౬౮ ||

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ |
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా || ౧౬౯ ||

చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా |
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా || ౧౭౦ ||

దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |
కౌళినీకేవలాzనర్ఘ్యకైవల్యపదదాయినీ || ౧౭౧ ||

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః || ౧౭౨ ||

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ |
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ || ౧౭౩ ||

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ || ౧౭౪ ||

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ || ౧౭౫ ||

ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ |
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా || ౧౭౬ ||

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ |
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ || ౧౭౭ ||

సువాసిన్యర్చనప్రీతాzzశోభనా శుద్ధమానసా |
బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా || ౧౭౮ ||

దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ |
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ || ౧౭౯ ||

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా ||
Principle Of Karma :-

ఆచమనము :-

ఆచమనము అనే పదానికి ఉపస్పర్శం అంటే అరచేతిలో నీరు పోసుకొని నోటితో గ్రహించడమని అర్ధం. ఏదైనా ఒక పవిత్రమైన పని చేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనస్సు, వాక్కు, శరీరం - అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడినది. సంధ్యావందనం మొదలైన సమయాలలో ఆచమనానికి చాలా ప్రాముఖ్యమున్నది. ఆచమనం అంటే కేవలం ఒక ఉద్ధరణి నీళ్లు చేతిలో పోసుకొని లోపలికి పుచ్చుకోవడం మాత్రమే కాదు, మంత్ర పూత జలంతో శరీరాన్ని స్పర్శించడం, స్నానం చేయడం కూడా ఆచమనమే. ఆచమనం నాలుగు విధాలు. అవి : 

1. శ్రుత్యాచమనం : స్వాధ్యాయ బ్రాహ్మణంలోని శ్రుతి ‘‘హస్తా వవవిజ్య రతిరాచమేత్‌...’’ అంటూ చేతులు కడుగుకొని, ‘‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’’ ఆని ఆచమనం చేయాలి. తరువాత రెండు చేతులను శుద్ధి చేసుకొని, ఉదకాన్ని స్పృశించి, కుడి చేతితో ఎడమ చేతిమీద, పాదాల మీద నీళ్లు చల్లుకోవాలి. శిరస్సు, నేత్రాలు, ముక్కు, చెవులు, హృదయ స్థానాలను తాకాలి. 

2. శ్రౌతాచమనం : గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలను విడివిడిగా స్వాహాకారంతో పఠిస్తూ, అంటే ఓమ్‌ తత్సవితుర్వరేణ్యగ్‌ స్వాహా, భర్గోదేవస్య ధీమహి స్వాహా, ధియో యోనః ప్రచోదయాత్‌ స్వాహా అని పలుకుతూ ఆచమించడం మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. 

3. స్మృత్యాచమనం/ స్మార్తాచమనం : పీట/ కృష్ణాజినం మీద కూర్చుని, పాదాలను నేలపై ఉంచి, ఆపస్తంబ సూత్ర సంప్రదాయంలో ఆచమించే పద్ధతి. బొటన వ్రేలితో పెదవులను తుడుచుకోవడం లాంటి క్రియలు ఇంకా ఉన్నాయి. 

4. పురాణాచమనం : ముమ్మారు కేశవ నామాలతో ఆచమించడం, గోవిందాది నామాలతో అవయవ శుద్ధి మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. శ్రుత్యాచమనం, శ్రౌతాచమనం ఒక్కటేనని కొందరి భావనగా దువ్వూరి రామకృష్ణారావుగారి సంపాద కత్వంలో వెలువడిన సంధ్యావందనం గ్రంథంలో వ్రాశారు. కావచ్చు. శ్రుతి, శ్రౌతం వేరు కావు.

రకాలు :-
శ్రుతి, స్మృతి, పురాణాలలో 3 రకాల ఆచమనాలు చెప్పబడ్డాయి.
శ్రుత్యాచమనం: గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ చేసే ఆచమనం.
స్మృత్యాచమనం: ఆపస్తంబాది ఋషులు చెప్పిన విధానాన్ని అనుసరించి చేసే ఆచమనం.
పురాణాచమనం: కేశవాది నామోచ్ఛారణ చేస్తూ కావించే ఆచమనం.

ఆచమన విధానము:-
ప్రతి కార్యమున౦దు ఒక్కొక్క ఆచమనవిధానము చెప్పబడినది. ఆచమనము ద్వారా కేవలము మనలను మనమే శుధ్ధి చేసుకొనుటయేగాక బ్రహ్మను౦డి మొదలుకొని సమస్తమును పరితృప్తి చేయుచున్నాము ఆచమనము చేయకు౦డా చేసెడు కర్మలన్నియుని వ్యర్ధములైపోవును. కావున శౌచాన౦తరము కూడా శాస్త్రమున౦దు ఆచమనక్రియ నిర్దేశి౦పబడినది. శుభ్రమైన మడి వస్త్రమును మూడు, ఐదు గోచులుగా ధరి౦చి, శిఖ ముడివేసుకొని వుపవీతియై ఉ౦గరపు వ్రేలునకు దేవపవిత్రమును ధరి౦చి, ఆసనముపై సావధాన చిత్తముతో కూర్చొని, పాదములను నేలమీద ఉ౦చి ఆచమనము చేయవలయును. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు నకు ముఖము చేసి మాత్రమే ఆచమనము చేయవలెను.

ఆచమనము చేయు నీరు బుడగలు, నురుగు లేనిదిగ స్వచ్చముగ ను౦డవలెను. ఆచమి౦చునపుడు నోటిను౦డి ఎటువ౦టి శబ్దము రాకూడదు.

ఆచమనము చేయు జలము బ్రాహ్మణునకు హృదయము వరకు, క్షత్రియులకు క౦ఠమువరకు, వైశ్యులకు తాలువు(దౌడ)వరకు, శూద్రులకు మరియు స్త్రీలకు నాలుక వరకు చేరునట్లుగా తీసుకొనవలెను.

గోకర్ణాకృతిగా పట్టిన హస్తములో మినుపగి౦జ మునుగున౦తటి జలమును మాత్రమే తీసికొని అరచేతితో ఆచమనము చేయవలెను. గోకర్ణాకృతి మూడు విధములుగా చెప్పబడినది.

1. బొటనవ్రేలి మధ్య వ్రేలి మూలమునకు వ౦చిపెట్టి, చూపుడువ్రేలును దానిమీదకి వ౦చిపెట్టి, తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచిపెట్టినచో హస్తము గోకర్ణాకృతికి(గోకర్ణము-ఆవు చెవి ఆకారమునకు) వచ్చును లేదా
2. చూపుడు వ్రేలును వ౦చి బొటన వ్రేలి మూలమునకు చేర్చిపెట్టి, బొటనవ్రేలి మధ్యవ్రేలి మధ్య గణుపునకు చేర్చి తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును. లేదా
3. అరచేతిని అర్ధచ౦ద్రాకారముగా మడచి ఆవుచెవి వలె చేయవలెను, కనిష్ఠిక(చిటికెనవ్రేలు)ను మరియు అ౦గుష్ఠమును దూరముగ - వేరుగా చేసి తక్కిన మూడు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి పట్టినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును.

ఆచమనము చేయునప్పుడు ఎడమచేతి చూపుడువ్రేలుతో కుడిచేతిలోగల జలమును స్పృశి౦చుటవలన సోమపానము యొక్క ఫలము లభి౦చును.

తుమ్మినప్పుడు, ఉమ్మినతర్వాత, నిద్రి౦చిలేచిన పిమ్మట, వస్త్రములను ధరి౦చిన మీదట, ఆవిలి౦త వచ్చిన పిదప, అశృవులు - కనులను౦డి నీరు జారిన తదుపరి ఆచమనము చేయవలెను లేదా కుడిచెవిని స్పృశి౦చుట చేత ఆచమనవిధి పూర్తియగును.

మోకాళ్ళకు పైగా జలమున౦దు నిలబడి కూడా ఆచమి౦చవచ్చును. నీరు మోకాటిలోతుక౦టే తక్కువగా ఉ౦డినచో ఈమాట చెల్లనేరదు. అప్పుడు కూర్చు౦డియే ఆచమనము చేయవలెను.
శ్రీవారికి సుప్రభాత సేవ :-

ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్తారు. వారు కూడా స్నానసంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని సన్నిథిగొల్ల రాకకోసం ఎదురు చూస్తుంటారు. సన్నిథిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు.
అర్చకస్వాములు మహాద్వారం వద్దకు రాగానే 'నగారా' మండపంలోని నౌబత్ ఖానా (పెద్ద పలకగంట)ని హెచ్చరికగా మోగిస్తారు.


ఆ ఘంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.తమ వద్ద ఉన్న 'కుంచెకోల'ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.

సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు.


ఆ సమయానికి జియ్యంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడ్కొని సన్నిథిగొల్ల ఆలయానికి వెళ్తారు.సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు అందరూ బంగారు వాకిలిముందు సిద్ధంగా ఉంటారు.తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.

సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు.
సన్నిథిగొల్ల పేష్కారు వద్దనున్న సీలువేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో, సీలువేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు. తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం  ఆనవాయితీ.తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.

ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరకు వేస్తారు.బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.

సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.సన్నిథిగొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు.దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.

ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు.తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు.

ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ... మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.

బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. 'నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.

అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.

ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఎకాంగికి ఇస్తారు. సన్నిథిగొల్లకు కూడా తీర్థం, శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు.దీని తరువాత జియ్యంగారు, ఏకాంగి, సన్నిథిగొల్ల బంగారు వాకిలి వెలుపలకు వస్తారు. దేవస్థానం పరిచారికలు లోపలికి వెళ్ళి శ్రీవారి పాన్పును, మంచాన్ని బయటగల 'సబేరా' గదిలోకి తీసుకు వెళ్తారు.

సుప్రభాతం పఠించిన వేదపండితులు, అన్నమాచార్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానం తరపు వారు ఇంకా స్వామి వారి కైంకర్యంలో పాల్గొన్న స్థానీయులు స్వామి వారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, చందనం, శఠారి మర్యాదలు పొందుతారు. వీరందరికీ శ్రీవారికి నివేదించిన చందనం, వెన్న ప్రసాదంగా ఇస్తారు.

ఆ తరువాత ఆలయాధికారులు, సర్కారు (దేవస్థానం) వారి హారతి జరిపి తీర్థచందన నవనీత ప్రసాదం స్వీకరిస్తారు.స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, శఠారులను స్వీకరిస్తారు.
ఓంనమఃశివాయ :-

ఓంకార రహితమైన ‘నమఃశివాయ’ అనేది ‘పంచాక్షరీ’ మంత్రమనీ, ఓంకార సహితమైన ‘ఓంనమఃశివాయ’ అనేది ‘షడక్షరీ’ మంత్రమని చెప్పబడింది.

“ఓం నమః శివాయ” షడక్షరీమహామంత్రంలోని ‘ఓం’ – పరబ్రహ్మస్వరూపాన్ని, ‘న’ – పృథ్విని, బ్రహ్మను, ‘మ’ – జలాన్ని, విష్ణువును, ‘శి’ – తేజస్సును, మహేశ్వరుని, ‘వా’ – వాయువును, జీవుని (ఆత్మ), ‘య’ – ఆకాశాన్ని, పరమాత్మను… ఈ విధంగా షడక్షరీమంత్రంలో మంత్రాక్షరాలు పంచభూతాలను, బ్రహ్మాదిదేవతలను సూచిస్తున్నాయి.

ఇక, ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీమంత్రంలో, ‘నమః’ అను పదానికి జీవాత్మ అనీ, ‘శివా’ అనే పదానికి పరమాత్మ అనీ, ‘ఆయ’ అను పదానికి ఐక్యం అని అర్థమవడం వలన జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందటం అని అర్థం. ఈవిధంగా పంచాక్షరీమహామంత్రం బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతోంది.
Reasons To Believe Hinduism Is Based On Science :-


1. Tree :-
People are advised to worship Neem and Banyan tree in the morning. Inhaling the air near these trees, is good for health.


2. Yoga :-
If you are trying to look ways for stress management, there can’t be anything other than Hindu Yoga aasan Pranayama (inhaling and exhaling air slowly using one of the nostrils).


3. Moolasthanam :-
Hindu temples are built scientifically. The place where an idol is placed in the temple is called ‘Moolasthanam’. This ‘Moolasthanam’ is where earth’s magnetic waves are found to be maximum, thus benefitting the worshipper.


4. Tulsi :-
Every Hindu household has a Tulsi plant. Tulsi or Basil leaves when consumed, keeps our immune system strong to help prevent the H1N1 disease.


5. Mantra :-
The rhythm of Vedic mantras, an ancient Hindu practice, when pronounced and heard are believed to cure so many disorders of the body like blood pressure.


6. Tilak :-
Hindus keep the holy ash in their forehead after taking a bath, this removes excess water from your head.


7. Kumkum :-
Women keep kumkum bindi on their forehead that protects from being hypnotised.


8. Eating With Hands :-
Eating with hands might be looked down upon in the west but it connects the body, mind and soul, when it comes to food.


9. Leaf Plate :-
Hindu customs requires one to eat on a leaf plate. This is the most eco-friendly way as it does not require any chemical soap to clean it and it can be discarded without harming the environment, banana; palash leaves, etc.


10. Piercing :-
Piercing of baby’s ears is actually part of acupuncture treatment. The point where the ear is pierced helps in curing Asthma.


11. Turmeric :-
Sprinkling turmeric mixed water around the house before prayers and after. Its known that turmeric has antioxidant, antibacterial and anti-inflammatory qualities.


12. Cow Dung :-
The old practice of pasting cow dung on walls and outside their house prevents various diseases/viruses as this cow dung is anti-biotic and rich in minerals.


13. Cow Urine :-
Hindus consider drinking cow urine to cure various illnesses. Apparently, it does balance bile, mucous and airs and a remover of heart diseases and effect of poison.


14. Punishment :-
The age-old punishment of doing sit-ups while holding the ears actually makes the mind sharper and is helpful for those with Autism, Asperger’s Syndrome, learning difficulties and behavioural problems.


15. Lamps :-
Lighting ‘Diyas’ or oil or ghee lamps in temples and house fills the surroundings with positivity and recharges your senses.


16. Janoyi :-
‘Janoyi’, or the string on a Brahmin’s body, is also a part of Acupressure ‘Janoyi’ and keeps the wearer safe from several diseases.


17. Thoran :-
Decorating the main door with ‘Thoran’- a string of mangoes leaves; neem leaves; ashoka leaves actually purifies the atmosphere.


18.Touching :-
Touching your elder’s feet keeps your backbone in good shape.

19. Cremation :-
Cremation or burning the dead, is one of the cleanest form of disposing off the dead body.


20. ॐ :-
Chanting the mantra ‘Om’ leads to significant reduction in heart rate which leads to a deep form of relaxation with increased alertness.


21. Hanuman Chalisa :-
Hanuman Chalisa, according to NASA, has the exact calculation of the distance between Sun and the Earth.


22. Shankh :-
The ‘Shankh Dhwani’ creates the sound waves by which many harmful germs, insects are destroyed.The mosquito breeding is also affected by Shankh blowing and decreases the spread of malaria.

చేతులతో ఆహారాన్ని తినండి :-

మన పూర్వీకుల ప్రవర్తనల వెనుక విస్తారమైన జ్ఞానం ఉందని తెలుస్తుంది.మీ చేతులతో తిన్నఆహారం శరీరమునకే కాక మనస్సుకి కూడా మేత.

చేతులతో తినడం వెనుక ఒక కారణం ఉంది. చేతులతో తినడం అభ్యాసం ఆయుర్వేదిక బోధనల నుండి ఉద్భవించింది. వేదాల ప్రకారం శక్తి అనేది చేతిలో వుంటుంది. చేతులతో ఆహారం తినడం ఒక పురాతన హిందూ స్థానిక సంప్రదాయం లో ప్రబలంగా ఉన్న ఒక ముద్ర నుండి తీసుకోబడింది. ముద్రలు అనేవి ధ్యాన సమయంలో లేదా భారత నృత్య శాస్త్రీయ రూపమైన భరతనాట్యంలో చాలా ప్రముఖమైనవి.

చేతులు అనేవి చర్యలు నిర్వహించడానికి అత్యంత విలువైన అవయవాలుగా భావిస్తారు. ఈ విషయం ఒక వేద ప్రార్థనతో ముడిపడి ఉంది "కరగ్రే వసతే లక్స్మిహ్ కరములె సరస్వతి కరమధ్యేతు గోవిందః ప్రభతె కరదర్శనం" (మీ వేళ్ల చివర సరస్వతి దేవి, మధ్యలో గోవిందుడు, మరియు కొన వద్ద లక్ష్మీదేవి ఉంది అని అర్ధం); మన అరచేతులు చూసి వర్ణించు శ్లోకం ఇది. దైవత్వం మానవ ప్రయత్నంలో ఉంది అని సూచిస్తుంది ఈ శ్లోకం.

మన చేతులు మరియు కాళ్ళు ఐదు మూలకాల గొట్టాలుగా చెప్పబడినవి. ఆయుర్వేద గ్రంథాలు, ప్రతి వేలు ఐదు మూలకాల యొక్క పొడిగింపుగా భోదిస్తుంది. బొటనవేలు (అగ్ని) ( మీరు చిన్న పిల్లలని వారి బొటనవేలు చప్పరించ్డం చూసి ఉండవచ్చు, వారికి జీర్ణక్రియ భౌతికంగా సాధ్యపడనప్పుడు, ప్రకృతి చేసే సహాయం), చూపుడు వేలు (గాలి), మధ్య వేలు (ఈథర్- మానవ శరీరంలో చిన్న కణ ఖాళీలు), ఉంగరం వేలు (భూమి) మరియు చిటికెన వేలు (నీరు) సూచిస్తాయి.

ఆహారం తినటప్పుడు అంతర్గత జీర్ణక్రియలో వెళ్ళే ముందు ప్రతి వేలు ఆహారం తాకటం వల్ల రూపాంతరం చెందుతుంది. వేళ్లనందు ఆహరం తీసుకోవడం వలన ఐదు అంశాలు ఉద్దీపన కావింపబడి అగ్ని చేత జీర్ణ కారి ఆహ్వానింపబడుతుంది. జీర్ణక్రియ అభివృద్ధితో పాటు రుచి, వాసనల ద్వారా మనసు చేతన అవుతుంది మరియు ఇది తినడం యొక్క ఆనందం పెంచుతుంది.

పూర్వం పెద్దలు, ఆహార పదార్ధాలు కొలవడానికి పాత్రలను వాడేవారు కాదు. పాత్రలకు బదులుగా పరిమాణం కొలిచెందుకు వారి చేతులు ఉపయోగించడానికి ఇష్టపడేవారు. ఇది ఎందుకంటే, ఒక చేతిలో పట్టే ఆరహం శరీరానికి తగిన శక్తి అందించడానికి సరిపోతుంది. మొత్తం 6 విధములైన కొలతలు ప్రాచురణ వున్నవి. ఇవి ఆహార , పిండి మరియు వితానల యొక్క నిర్దిష్ట కొలత కొలిచేందుకు సరిపోతాయి.
హిందూ మత సంస్కృతిలో ఇలాంటి ఒక ప్రధాన ఉదాహరణ అసాధారణంగా అనిపించవచ్చు, కాని ఇలా అనేక విషయాలను విసదీకరిస్తే, మన పూర్వీకుల ప్రవర్తనల వెనుక విస్తారమైన జ్ఞానం మొత్తం తెలుస్తుంది.

Happy Mothers Day :-

జపం :-

మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ., మంత్రాన్ని కానీ., ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చెయ్యాలనే సంఖ్యానియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందులవల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో., మరునాడు ఈరోజు మిగిలిన జపసంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది. జపాన్ని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంఖ్య పూర్తిచెయ్యడమే ప్రధాన లక్ష్యంగా జపం చెయ్యకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.

వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్


జపం.. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది :-

వాచికము :- బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని ‘వాచికము’ అంటారు.
ఉపాంశువు :- బయటకు వినిపించకుండా, కేవలం పెదవులు కదుపుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ‘ఉపాంశువు’ అంటారు.
మానసికము :- నాలుక, పెదవులు కదలకుండా మౌనంగా మనస్సు లోలోపలే జపం చేసే విధానాన్ని ‘మానసికము’అంటారు.

ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు., ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్ఠము అని శాస్త్ర ప్రమాణము.

హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ


ప్రాతః కాలమునందు చేతులు నాభి వద్దకు చేర్చి., మధ్యాహ్నమునందు చేతులు హృదయము వద్దకు చేర్చి., సాయంకాలమునందు చేతులను ముఖమునకు సమాంతరముగా ఉంచి జపం చేయవలెను. చందనపూసలతో, అక్షతలతో, పూవులతో, ధాన్యముతో, మట్టిపూసలతో జప సంఖ్యను లెక్కించకూడదు. లక్క, దర్భ, సిందూర పూసలతో కానీ., ఎండిన ఆవుపేడ పూసలతో కానీ రుద్రాక్ష, తులసి, స్ఫటిక పూసలతో కానీ చేసిన జపమాలలతో జప సంఖ్యను లెక్కించుట శ్రేష్ఠము.

జపమాల :- 
జపమాలలో 108 పూసలు ఉంటాయి. మాల రెండు కొసలు కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపము చేయునప్పుడు జపమాల కనిపించకుండా వస్త్రాన్ని కప్పి చేయాలి. కానీ, ఆ వస్త్రం తడిగా ఉండకూడదు. జపమాలను అనామిక వ్రేలు (ఉంగరపు వ్రేలు) పైనుంచి బొటనవ్రేలుతో పూసలను లెక్కించవలెను. చూపుడువ్రేలును ఉనయోగించరాదు. సుమేరుపూసను దాటి ముందుకు పోరాదు. సుమేరేపూస దాకా వచ్చిన తర్వాత మాలను వెనుకకు త్రిప్పి జపము చేయవలెను. ఒకవేళ జపమాల చేతినుంచి జారి క్రిందపడినచో, ఆ జపసంఖ్య లెక్క లోనికి రాదు. మరల జపమాల మెదటి నుంచి జపము చెయ్యాలి. జపమాల కాలికి తగిలిన ఎడల, దానిని నీటితో కడిగి రెట్టింపు సంఖ్యలో జపం చెయ్యాలి. జపము చేయునప్పుడు మాట్లాడుట కానీ, కదులుట కానీ చేయరాదు. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, క్షమాభావనతో భగవంతుని స్మరించి తిరిగి జపం ప్రారంభించాలి. గృహమునందు జపము చేసిన దానికన్న గోశాలయందు వందరెట్లు, వనములందు లేదా తీర్థస్థానములందు వేయిరెట్లు, పర్వతములమీద పదివేలరెట్లు, నదీతీరములందు లక్షరెట్లు, దేవాలయములందు కోటిరెట్టు, శివలింగము దగ్గర అనంతమైన పుణ్యఫలము లభించునని శాస్త్ర ప్రమాణము.

శరవణభవ :-

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందుహస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మ తపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు) రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు.

శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు

అని ‘శరవణభవ’ కు గూఢార్థం.

ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి. ఈ పేర్లలో ఎంతో నిగూఢార్థం ఉంది.
షణ్ముఖుడు :- సుబ్రహ్మణ్యస్వామి ఆరు ముఖాలుగలవాడు కనుక షణ్ముఖుడనబడుతున్నాడు. అదేవిధంగా షణ్ముఖుడు పంచభూతాల సంగమానికి సంకేతం. ఆయన ఈ సృష్టిలోని సమస్తంలో ఉన్నాడు.

సుబ్రహ్మణ్యస్వామి :- 
షణ్ముఖుని స్వరూపం జ్యోతిర్మయమైనది. పరమశివుని త్రికూటి నుండి వెలువడిన అగ్ని కీలలతో ఆరుముఖాల షణ్ముఖుడు ఉద్భవించాడు. ఆ జ్యోతి స్వరూపుడు మనలోని అజ్ఞానాంధకారాన్నిపారద్రోలి, మన మనసులలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు. శూరపద్ముని ఆవరించియున్న మాయను తొలిగించి, అతనికి మోక్షమార్గాన్ని చూపినందుకే స్వామిని మనమంతా సుబ్రహ్మణ్యస్వామి అని కొలుచుకుంటున్నాం. సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు.

స్కందుడు :-  
స్వామి దగ్గరకు మనం మోకరిల్లితేనే చాలు మన ఊపిరి సుగంధపరిమళాలతో నిండిపోతుంది. ఈ విషయాన్ని ముందుగా స్వామి తల్లి పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరు తామరపుష్పాలలో గమనించినపుడు తెలుసుకుని మురిసిపోయింది. అలాగే ‘స్కంద’ అంటే ఒకటిగా చేరినది అని అర్థం. పార్వతీదేవి ఆరుపద్మాలలో ఆరు శిశువులను చూసిన కాసేపటికి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే స్కందుడయ్యాడు.
శరవణభవ :- శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో –

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు


గాంగేయుడు :- శివుని త్రినేత్రం నుండి వెలువడిన జ్యోతి కిరణాలు శరవణపోయ్ గై అనే నదిలో ఐక్యం అయిన తరువాత స్వామి ప్రత్యక్షమవడం వలన గాంగేయుడు అని పిలువబడుతున్నాడు. గాంగేయుడు అంటే గంగపుత్రుడు.

వేలాయుధుడు :- 
స్వామి ఆయుధం శూలం (వేల్ అని తమిళంలో అంటారు) ఈ వేల్ తోనే శూరపద్ముడు, అతని దుష్టపరివారమంతా సంహారించబడింది. వేల్ జ్ఞానశక్తికి ప్రతీక. స్వామి తన తన వేలాయుధంతో మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానదీపికలను వెలిగిస్తున్న వేలాయుధుడు. ఇలా స్వామి యొక్క ప్రతినామంలో ఎంతో గూఢార్థం ఉంది. ఇక, హరిహరుల తత్త్వమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారి తత్త్వం.
పురుషో విష్ణురుత్యుక్తః శివోవా నామతః స్మృతః
అవ్యక్తంతు ఉమాదేవి శ్రీర్వాపద్మనిభేక్షణా!
తత్సం యోగాత్ సముధ్బూతః సహిసేనాపతి ర్గుహః


పురుషోత్తముడైన విష్ణువు లేదా పరమేశ్వరుడు అవ్యక్త శక్తి శ్రీమహాలక్ష్మీ లేదా పార్వతీదేవి వీరిరువురి సమన్వయ సమైక్యతా తత్త్వ మూర్తియే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని స్కంధ పురాణం తెలియజేస్తుంది.
వివరంగా చెప్పాలంటే శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీ నారాయణులను కలిపి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే శ్రీ సుబ్రహ్మణ్య తత్త్వం. అదే హరిహరులు ఒక్కటేనన్న అద్వైత తత్త్వం.

అందుకనే తమిళనాడులో పళముదిర్ చోళై అనబడే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీమహావిష్ణు, శ్రీసుబ్రహ్మణ్యులు ఒకే ప్రాగణంలో వెలసియున్నారు.
నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
నమస్తే నమస్తే సదాభీష్టపాణే


ఈ షణ్మతాలలోను ముఖ్యమైనది అగ్ని ఆరాధన. అగ్ని కారమైన ఔపాసనకు శ్రీసుబ్రహ్మణ్యుడు అధిదేవత. అందువలన ఆయనను వదలిపెట్టి తక్కిన ఐదుగురు గణపతి, సూర్యుడు, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుడు, అంబికలను పంచాయతన పూజలో ఆరాధిస్తూన్నాము. అందువలన ఆయన ఆరాధన, పంచాయతన పూజా కలిసి, షణ్మత సాధన అవుతోంది.

వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు. బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ స్వరూపాన గుహుడు. ఆయనకు అగ్నిభూః అనే పేరుంది. సేనాని అగ్నిభూః, గుహః అని శ్రీ సుబ్రహ్మణ్య నామావళి కూర్చబడింది.

కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకిప్రాకి అగ్ని తత్త్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే ఆయన. సంవత్సరాగ్నిగా, కాలస్వరూపుడిగా…ఆరు ఋతువులు ఆయనకు ఆరు ముఖాలు. పన్నెండు మాసాలు ఆయనకు గల పన్నెండు చేతులు. ఆయన అభయ స్వరూపుడు.

" సేనా విదారక స్కంధ మహాసేన మహాబల
రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే !!"


రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టివాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టివాడా, షణ్ముఖా, నీకు నమస్కారం.

ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులమౌతాము.

“స్వామి” అన్న పదం అందరి దేవతలకు వర్తించినా, అది శ్రీసుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే అనువర్తిస్తుంది. అమరకోశంలో స్వామి అను పదానికి దేవసేనాపతి, శూరః, స్వామీ గజముఖానుజః అని శ్రీ సుబ్రహ్మణ్యుని గూర్చి పదాలలో ఉపయోగింపబడి ఉంది. స్వామి అన్న నామధేయం ఆయనదే.

ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై వుంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారాలు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు జ్యోతులలోకెల్లా జ్యోతియైన పరంజ్యోతి. ఆత్మ స్వరూపుడు. షణ్మతాలకు అధిపతి. గణపతిని ప్రధానంగా ఉపాశించునది గాణ పత్యము. సూర్యుని ఉపాశించునది సౌరము. అంబికను ఉపాశిస్తే అది శాక్తము. శివోపాసన శైవము. శ్రీమహావిష్ణు ఉపాసన వైష్ణవం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరమాత్మ అని ఉపాశించడం కౌమారం.

శివశక్తులు కలిసి నందువల్లనే జ్ఞానజ్యోతి ఏర్పడింది. అట్లేర్పడిన జ్యోతిస్వరూపుడైన కుమారుడే శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు. లోకానుగ్రహార్థం మూర్తీభవించినపుడు శ్రీసుబ్రహ్మణ్యుడిగా విలసిల్లుతున్నాడు. ఆయన శివశక్తుల సమ్మేళనం వలన ప్రభవించిన జ్ఞానఫలం. అందువలన ఆయన తన దివ్యశక్తిచే మన బాహ్యాంతరములందలి అజ్ఞానాన్ని శాశ్వతంగా పోగొట్టి మనకు అమరత్వాన్ని, అమృతత్వాన్ని కలుగజేస్తున్నాడు.

అరుణగిరినాధుడనే శ్రీ సుబ్రహ్మణ్య భక్తుడు తమిళగడ్డపై జన్మించాడు. ఆయననుణ కందరనుభూతి అనే గ్రంథాన్ని వ్రాశాడు. దానిలో వేర్వేరుగానున్న శివశక్తులు ఏకమై ఒకదివ్యశక్తిని ఉత్పాదించాయని, ఆశక్తి అనుగ్రహం వలన మనలోని ద్వైత భ్రమ తొలిగి ఏకత్వంలోకి తీసుకొని వెళ్ళి తనలో కలుపుకొంటున్నాడని వివరించాడు. ఆయన తిరుపుగళ్ అనే తమిళ స్తోత్ర గ్రంథంలో కూడా శివశక్తులకు జన్మించిన శ్రీసుబ్రహ్మణ్యుని వైష్ణవ పరంగా కూడా కీర్తించడం విశేషంగా ఉంటుంది.

తమిళభాషలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ‘మురుగన్’ అని అంటారు. ఆమాటకు అందమైన వాడని అర్థం. ఆయనకు ‘మరుమగన్’ అని కూడ పేరున్నది. ఆ మాటకు అర్థం మేనల్లుడని. ఒక ఇతివృత్తం ప్రకారం శ్రీవల్లీ దేవసేనలిరువురు శ్రీమహావిష్ణువు కుమార్తెలే అని, వారిని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వివాహమాడిన కారణంగా, ఆయన శ్రీమహావిష్ణువునకు మేనల్లుడు, అల్లుడు అయ్యాడని తెలుపబడింది.
ఈ విధంగా శ్రీసుబ్రహ్మణ్యుడు శైవానికి, వైష్ణవానికి సబంధించినవాడని తెలుసుకోవాలి.

ఐతే, ఉత్తరభారతంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గృహస్థుడుగా కాక నిరంతర బ్రహ్మచారిగా వ్యవహరింపబడుతున్నాడు. అక్కడ ఆయనకు కార్తికేయుడు అన్న పేరే ప్రసిద్ధమైనది. కుమారస్వామి అన్న పేరు కూడా వారికి విదియమైనదే. కాళిదాసు మహాకవి సంస్కృతంలో కుమార సంభవమనే గ్రంథాన్ని రచించారు. దీని ప్రస్తావన మొదట వాల్మీకి రామాయణంలోనే వచ్చినది. బాలకాండంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కంధుని జన్మవృత్తాంతము తెలియజేస్తాడు. ‘కుమారా స్సంభవ శ్చైవ ధన్యః పుణ్యస్తధైవచ’ అని వ్రాయబడింది. వాల్మీకి మహామునికి సాధారణంగా రామాయణ సర్గల పారాయణానికి ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు. కాని, ఇక్కడ ఫలశ్రుతి చెప్పాడు. వాల్మీకి బాలకాండంలోనే ఉపయోగించిన కుమార సంభావమను రెండు పదాలను మహాకవి కాళిదాసు మంగళవాక్యంగా భావించి తన గ్రంథమునకు కుమార సంభవమను పేరు పెట్టాడు.

స్కందుడన్న పేరు కూడా శ్రీ స్వామి వారికి ప్రసిద్ధమైనది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు. స్కందుడను పేరును మనస్సులో ఉంచుకొని శ్రీవ్యాసులవారు స్కంద పురాణాన్ని రచించారు. ద్రవిడ భాషలో స్కందుడను పదమునకు వికృతి కందుడు.

మాతృదేవోభవ, పితృ దేవోభవ అనేవి వేద శానములు. శివ, శక్తులు మాతాపితలుగా వేర్వేరుగా కాక అర్థనారీశ్వర రూపంలో కలిసి ఉన్నారు. సత్ పరేమేశ్వరుడు కాగా చిత్ అంబిక. ఈ సత్ చిత్ రెండును ఏకము కాగా ఆనందం ఉద్భవించింది. ఆ సచ్చిదానందమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. శివమనే మంగళం, అంబిక అనే కారుణ్యం కలిసిన రూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు.

శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభూవము గలడు. తిథులలో అరవది షష్టి. ఆయన జన్మతిథి కూడా అదే. షష్ఠి ప్రియుడు, షడాననుడు అనగా ఆరు ముఖములుగలవాడు. ఆయన మంత్రం షడక్షరి “శరవణభవ”. ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది.
ఇట్టి విశిష్ట జ్ఞానస్వరూపుడగు శ్రీసుబ్రహ్మణ్యుని ఆరాధన సర్వానర్థాలను తొలగించి, సర్వాభీష్టసిద్ధిని కలిగించి జ్ఞానసంపన్నులను చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

శీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శివ శక్తులకు జన్మించిన తిథి మార్గశిరశుద్ధ షష్ఠి. మహనీయులు జన్మలు లోక కంటకులను నిర్మూలించి, సజ్జనులను కాపాడటానికేనన్న విషయం లోక విదితమైనదే. తారకాసుర, శూర పద్మాసురాది రాక్షసులను దునుమాడుటకై కార్తికేయుడు ఉద్భవించాడు. ఆ మహామహితాత్ముడు జన్మించిన రోజును శ్రీసుబ్రహ్మణ్యషష్ఠియని స్కందషష్ఠియని, సుబ్బారాయుడి షష్ఠి అని, కుమారషష్ఠియని వ్యవహరిస్తారు.

భవిష్యోత్తరపురాణం ప్రకారం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనాధిపతిగా 5 రోజులు భీకరమైన పోరాటం సాగించి ఆరవరోజు యుద్ధంలో తారకాసురాది రాక్షసులను సంహారించి పదునాల్గు భువనాలకు సంతోషాన్ని కలిగించాడు. ఆయన అసాధారణ శక్తి సామర్థ్యాలను త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు కొనియాడారు. శ్రీస్వామివారు లోక సంరక్షణార్థమునకు శాటి స్థాపనకు చేసిన కృషికి గుర్తింపుగా మార్గశిరశుద్ధషష్ఠి ఆయన జన్మదినంగా పరిగణించి, వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు కొన్ని ప్రాంతాలలో మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి షష్ఠి వరకు నిర్వహిస్తారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు దేవసేనను షష్ఠి రోజునే పరిణయం చెసుకొన్నారు.
శ్రీవేదవ్యాసభగవానులు షష్ఠి ప్రాముఖ్యతను తెలియ జేస్తూ తస్మాత్ షష్ఠీ మహాతిథిః అని అన్నారు.
షష్ఠి రోజున ఉపవాసముండి షణ్ముఖూని పూజించి బ్రహ్మచారికి వస్త్రదానమిచ్చి భోజనం పెట్టి ఆనందింప జేయాలి. కొంతమంది శ్రీస్వామివారిని సర్పాకారంగా ఆరాధించి పుట్టలో పాలు పోస్తారు.
కుజదోషమున్నవారు ఆ రోజున ఉపవాసముండి, సర్పదేవతను ప్రార్థించి పుట్టలో పాలుపోసి తమ దోషాలను పోగొట్టమని శ్రీస్వామివారిని వేడుకొంటారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చాలామంది సర్పాకారంలో పూజిస్తుంటారు. ఇందువెనుక కొన్ని జ్యోతిశ్శాస్త్ర అంశాలున్నాయి. ఈయన మేష లగ్నం, వృశ్చిక రాశిలో జన్మించాడు. వృశ్చికరాశి జలరాశి అని కూడా పేర్కొనబడినది. శరవణ తటాకంలో జన్మించాడు గదా! మేష రాశికి అధిపతి కుజుడు. పురుషత్వానికి ప్రధాన కారకుడు శ్రీస్వామి శివతేజంవల్ల జన్మించాడు కావున అగ్ని స్వరూపుడు. అగ్నిధరుడని కూడా అంటారు. కుజునకు అధిష్ఠాన దేవత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ఆయనను సేవిస్తే తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది.

ఇక, షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వృశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు 6 రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మన శరీరంలోని షట్ చక్రాలు. వృశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో శ్రీస్వామివారు కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగ భూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీ రూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సర్ప రూపంలో పూజిస్తారు.
ప్రాణశక్తి మన శరీరంలో మూలాధారమనే చోట సర్పరూపంలో కేంద్రీకరింపబడి ఉంటుంది. మనకు దాని మహాశక్తి తెలియదు. అది నిద్రిస్తున్న సర్పము వంటిది. దానిని తట్టి లేపుటకు అసాధారణమైన యోగసాధన అవసరం.

ఒక వ్యక్తి యోగాభ్యాసం చేస్తూ నేలపై కూర్చుండి యుండినపుడు అతని ఆకారం యోగ పరంగా గమనిస్తే పాము శరీరంలాగా ఉంటుంది. ఇలా కనిపించడంలో ప్రతిపక్షవ్యక్తి జ్ఞానపరంగా అభివృద్ధి చెంది, యోగాభ్యాసం చేసి తరించాలన్నది దానిలోని అంతరార్థం. మన శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఆరు ఉన్నట్లు యోగశాస్త్రం చెబుతుంది. ఈ ఆరింటిలో మూలాధార చక్రంలోనే ప్రాణశక్తి ఉంటుంది. అది సర్ప రూపంలో వుంటుంది. స్వప్నావస్థలో నున్నందున దాని శక్తి మనకు తెలియదు. యోగాభ్యాసం ద్వారా చేసే సాధనవల్ల మనం గొప్ప జ్ఞానశక్తిని సాధించి స్వప్నావస్థలోనున్న జ్ఞానశక్తిని లేపగల్గినపుడు అసాధారణ జ్ఞానం సిద్ధించి పరమానందం కలుగుతుంది.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి ఆరు అంకెతో సంబంధముంది. ఆయన షణ్ముఖుడు. సహజంగా జ్ఞానస్వరూపుడు. యోగమూర్తి. పూర్వజన్మలో సనత్కుమారులుగ జన్మించిన బ్రహ్మమానసపుత్రుడు. నిరంతర తపస్సమాధిలో వుంటూ ఈ సృష్టిలోనే దేనినీ బేధభావంతో చూడక, వేదమూర్తిగా భాసించాడు. అదే ప్రవృత్తి ఈ జన్మలోనే సిద్ధించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నిరంతరం జ్ఞాననిష్ఠలో వున్న భక్తులను రక్షిస్తూనే వుంటాడు.