29 August 2015

బోనాల పండుగ :-

బోనాలు అమ్మవారు ని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.

అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.
పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగం :-
పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు(గావు పెట్టడం). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.
బోనం


బోనాలు :-
భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.


ఘటం :-
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.
లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.
ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది. ముస్లింలు కూడా పాల్గొనే ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీక! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో ఈ బోనాల జాతరలో కొన్ని లక్షల మంది పాల్గొంటారు.

లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు. ఈ అమ్మవారు మహామహిమాన్వితగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించడానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారు.

తెలుగు వారి సంస్కృతి వైభవానికి బోనాల పండుగ ఒక విజయకేతనం. ఇది తెలంగాణా ప్రత్యేకతను చాటే విశిష్ట పండుగ. పండుగైనా ఏదో ఒక సందర్భానికి ప్రతీకగా నిలిచిపోయి వుంటుంది. అలాగే ఈ బోనాల పండుగ కూడా ఋతువులు మారే ఈ ఆషాడమాసంలో వర్షాలు ప్రారంభ మవుతాయి. వాతావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా వ్యాధులు సంక్రమించేకాలం. ప్రాచీనకాలంలో ఈ ఋతువులో కలరా, ప్లేగు వ్యాధులు ఎక్కువగా వ్యాపిం చేవి. ఇప్పుడంత వైద్య సౌకర్యాలు లేని ఆ రోజులలో దేవతలను కొలిచేవారు.1813 సం||లో నగరంలో వేలాది మంది ప్లేగు వ్యాధి బారిన పడ్డప్పుడు మహంకాళీ దేవిని వేడుకోవటంతో వ్యాధి తగ్గు ముఖం పట్టిందని ఆనాటి ప్రజలు నమ్మారు. అప్పటి నుండి నగరంలో ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తు న్నారు.

ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది. ఈ పండుగలో ముస్లింలు కూడా పాల్గొనేవారని చెపుతున్నారు. ఇది మత సామరస్యానికి ప్రతీకనే కదా! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో ఈ బోనాల జాతర జరుగుతుంది.కొన్ని లక్షల మంది భక్తితో దీనిలో పాల్గొంటారు.జంట నగరాల నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి మహంకాళీ బోనాల జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు.

ఈ పండుగ జాతర మొదట గోల్కొండ కోటలో మొదలవుతుంది. ఈ మహోత్సవం ఈనెల 4న గోల్కొండ కోటలోని జగదాంబికా ఆలయంలో ప్రారంభమైంది. ఇది నెల రోజుల పాటు సాగుతుంది. గోల్కొండ కోటలో మాతా జగదాంబికా ఆలయంలో అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో ప్రధానమంత్రి సైనికాధి కారులుగా వున్న అక్కన్న మాదన్నల కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు చెపుతారు. నిజాం కాలంలో కూడా ఇక్కడ ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు జరిగేవి.

ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు నగరంలోని వివిధ దేవాలయాలలో జరిగి చివరకు మళ్లి గోల్కొండ కోటలో ముగుస్తాయి.

ఆషాడ మాసం రెండో ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ (లష్కర్‌ బోనాలు) ఆలయంలోను, మూడవ ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళీ అమ్మవారి ఆలయం లోను జరుగుతాయి. వీటితోపాటు జంటనగరంలోని అన్ని దేవాలయాల లోను బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి.
హరిబౌలీలోని అక్కన్నమాదన్న, శాలిబంబలోని ముత్యాలమ్మ, గౌలిపురాలోని కోట మైసమ్మ, సుల్తాన్‌ షాహి నల్ల పోచమ్మ, ఉప్పుగూడ మహంకాళి, అలియాబాద్‌ దర్బార్‌ మైసమ్మ, మిర్‌ఆలం మండి మాతామహంకాళి, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, మేకల మండి నల్ల పోచమ్మ ఇలా అనేక దేవాలయాలలో ఈ బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే ప్రతి చిన్న బస్తీలోనూ కూడా ఈ బోనాల పండుగ ఎంతో వేడుకగా జరుగుతుంది. అక్కన్న మాదన్న దేవాలయంలో మహంకాళీ అమ్మవారిని వీధులలో ఊరేగిస్తారు.లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాల యానికి ఒక ప్రత్యేకత వుంది. ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు. ఈ అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారని అంటారు. నిజాం ప్రభువులు నగర రక్షణ కోసం నగరం చుట్టూ పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు. నగరానికి రాకపోకలకు వీలుగా అక్కడక్కడ దర్వాజాలు, కిటికీలు ఏర్పాటు చేసి అక్కడ శక్తి స్వరూపుణి అయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాంటి దర్వాజాలలో లాల్‌దర్వాజా ఒకటి. ఇక్కడి దర్వాజాకు స్థానికులు పండగలకు ఎర్రని జాజు రంగు వేయడంతో లాల్‌దర్వాజా అనే పేరు వచ్చిందని అంటారు. లాల్‌దర్వాజా దగ్గర కూడా అమ్మవారి విగ్రహం వుండేది. అమ్మవారికి నిజాం నవాబు పూజలు చేసాడని అంటారు. 1908 సం||లో మూసీనదికి వరదలు వచ్చి నగరం అతలా కుతలం అయినప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌ అయోమయంతో పడ్డారు. అప్పటి ప్రధాని మహారాజా కిషన్‌ ప్రసాద్‌ సలహాకోరారు. ఆయనకు కూడా ఏం చెప్పాలో తోచక సంకట స్థితిని ఎదుర్కొన్నారు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఇలాంటి ప్రళయం సంభవిస్తుందని, ఆమెను శాంతిప జేయడానికి పూజలు చేయాలని నిజాం ప్రభువుకు సూచించారు. మహారాజా కిషన్‌ ప్రసాద్‌ సలహా మేరకు నిజాం నవాబు బంగారు చాటలో లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టు వస్త్రాలతో అమ్మ వారికి పూజ చేసారు.
అనంతరం ఈ ప్రాంతంలో స్థానికులు ఆలయాన్ని పునరుద్ధరించి 1968 సం||లో కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శంకచార్యులవారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. మొదట్లో ఇక్కడ కూడా బోనాల పండుగ సందర్భంగా జంతు బలులనిచ్చేవారు. అయితే 1953 నుండి జీవరక్షక ప్రచారమండలి సహకారంతో జంతుబలుల స్థానంలో గుమ్మడి కాయలను బలి ఇస్తున్నారు.ఈ బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ దేవాలయంలో అమ్మ వారిని పురవీధుల్లో ఊరేగిస్తారు.

మొదటి రోజు పలహారం బండిని ఊరేగిస్తారు. రెండో రోజు రంగం ఉంటుంది. శివసత్తులూగే మహిళ భవిష్యద్వాణి వినిపిస్తుంది. బోనాల పండుగ సందర్భంగా జరిగే యాత్రలో పురుషులు పాల్గొంటారు. నృత్యాలు చేస్తారు. కన్నుల పండు గగా జరిగే ఈ బోనాల పండుగ జాతర చూసి తీరవలసిందే.

No comments:

Post a Comment