27 August 2015

తీర్ధ ప్రసాదం :-

తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు "అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం... పాదోదకం పావనం శుభం" అంటూ తీర్ధం ఇస్తారు. భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన... ఈ తీర్ధం మిమ్మల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది.... సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది... అని భావం.
భగవంతుని దగ్గరకు వచ్చేవరకు అది ఉత్తి నీరే. కాని ఆయనను చేరాక అందులో తులసి, కర్పూరం... వంటివి చేరి తీర్ధంగా మారుతుంది. పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం, తులసి వంటివి ఆరోగ్యకారకాలు. గొంతులో ఏదైనా అడ్డుపడ్డట్టుగా ఉంటే తులసి ఆకు నమిలితే చాలు అడ్డు తొలగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. అలాగే కర్పూరం కూడా ! పురుషులు ఉత్తరీయాన్ని, స్త్రీలు పైటచెంగును చేతికింద పెట్టుకుని భగవత్ప్రసాదంగా భావిస్తూ ఒక్క చుక్క కూడా కిందపడనివ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్ధం తీసుకోవాలి.

తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు ఉంటాయి :-
1.జల తీర్ధం
2.కషయ తీర్ధం
3.పంచామృత తీర్ధం
4.పానకా తీర్ధం

జల తీర్ధం :-
ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించభడుతాయి .అన్ని కష్ఠాలు నుండి ఉపశమానాన్ని ఇస్తాయి .బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .


కషాయ తీర్ధం :-
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్ధాన్ని కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవించటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .


పంచామృత అభిషేక తీర్థం :-
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది .


పానకా తీర్ధం :-
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు.కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.పానకా తీర్ధాన్ని సేవిస్తే. దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది.


రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు.రుమాటిజం,ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుందిదేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .జీవితంలో శత్రువుల బాధ ఉండదు.బుద్ది చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది .


No comments:

Post a Comment