13 November 2013

పుట్టిన ప్రతి మనిషి మరణిస్తే,మరణమే ముగింపా ?

ప్రకృతి లో మొదటి జీవి ఆవిర్బవించి జీవపరిణాం లో మనిషి వచ్చాడని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఇది నిజమా? కాదా? ఏమిటి రుజువు? అంటే ఇది కేవలం. ఊహ మాత్రమే. చార్లెస్ డార్విన్ జీవపరిమాణ సిద్దాంతం ప్రకారం మనిషి కోతి జాతి నుండి పరిణామం చెందాడు.


మన ఇంట్లో కొన్నిగోదుమలు తీసుకొని పిండి చేసి చపాతి చేసుకున్నాం. ఇప్పుడు మనదగ్గర గోదుమలు లేవు.ఎందుకంటే? మనం వాటిని పిండి చేసి చపాతీ చేసుకున్నాం. మనిషి కోతి నుండి వస్తే మనం ఇప్పుడు కోతిని చూడలేము. లేదా ఇప్పటికీ మన శరీరంలో మార్పులు జరుగుతూ ఇంకా మనం పరిమాణం చెందుతూ ఉండాలి. ఇవేవి జరగటం లేదు కనుక ఇది నిజము కాదని చెప్పవచ్చు. ఐతే మనిషి ఎలా ఈ భూమిపైకి వచ్చాడు?


మనిషి తనకు తానుగా ఈ లోకం లోనికి రాలేదు. మనం ఒకరిచే సృస్టింప బడ్డవారము. మనలను సృస్టించినది ఎవరు అంటే అతడే దేవుడు. దేవుడు మనిషిని సృజించినపుడు వానిని యదార్దవంతునిగా చేశాడు. ఐతే మనిషి తాను పాపము చేసి తనని సృజించిన దేవున్ని మరచి దేవునికి దూరమయ్యాడు.


ఈ విశ్వాన్ని మనం గమనించినట్లయితే అంతా ఒక క్రమములో జరుగుతుందని గుర్తించవచ్చు. సూర్యుడు, దాని చుట్టూ గ్రహాలు అందులో ఒకటైన భూమి. భూమిచుట్టూతిరిగే చంద్రుడు. పరిమాణం లో భూమికంటే పెద్దవైన నక్షత్రాలు. ఇవన్నీఒక క్రమం లో ఈ విశ్వము లో ఉన్న మహోన్నత శక్తి ద్వారా నడిపించ బడుతున్నాయని. కాస్త సామాన్య తెలివి వున్న ఎవరైనా చెప్పగలరు. ఈ సృస్టి అంతటిని తన మాట ద్వారా చేసి ఒక క్రమములో నడిపిస్తున్నది, మనలను మన తల్లిగర్బము లో రూపొందించి నేటివరకు మన జీవమును మనలో వుంచినది, ఎవరు? సర్వ సృస్టీకర్త , సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు.

No comments:

Post a Comment