07 November 2013

పంచాంగ విషయాలు:

తిధి, వార, నక్షత్ర వివరములతో గ్రహ గమనాలతో , శుభ దినములతో , పండుగలతో, శుభాశుభ ముహూర్తములతో సూర్యోదయ ,అస్తమయ సమయములతో, వర్జ్య , దుర్ముహూర్త సమయములతో ప్రతిరోజూ మీ ముందుండెడిదే ఈ పంచాంగము.

 
ఈ పంచాంగము నక్షత్రముల , రాశుల దిన ,వార , మాస ,సంవత్సరాల వారీ ఫలితాలతో,గ్రహ దోషాలు, వాటి నివారణలతో సామాన్యులకు కూడ అర్ధ మగు రీతిలో మీ కందించబడుతుంది . ఈ అనంత మైన విశ్వములో మనము నివసించు చున్న భూమీ ఒక గుండ్రని గోళము.అటువంటి గోళములో విశ్వములో లెక్కలేనన్ని ఉన్నవి మనకు పెద్దవిగా కనబడి ఎక్కువగా చలనము ఉన్న వాటిని గ్రహములని,చిన్నవాటిని నక్షత్రములని అనుచున్నాము. ఈ గ్రహములు ముఖ్యముగా తొమ్మిది . సూర్యుడు ,చంద్రుడు ,అంగారకుడు ,బుధుడు ,గురుడు ,శుక్రుడు ,శని , రాఃహుడు ,కేతువు . సూర్యుడు ప్రధాన గోళముగా ఈ గోళములన్నియు సూర్యునిచుట్టు తిరుగు చున్నవి. వీనిలో కొన్ని ఒక దాని చుట్టూ మరియొకటి తిరుగుచూ ,ఒక దానినొకటి ఆకర్షించు కొనుచున్నవి . ఉదా : భూమి తన చుట్టూ తాను తిరుగుచూ ,సూర్యుని చుట్టూ గూడా తిరుగు చున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగు చున్నాడు.

 
భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన సూర్యుని వెలుతురు ఒక భూభాగము నుండి మరియొక భూభాగమునకు మారుటచే రాత్రి , పగలు ఏర్పడుచున్నవి. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుగుటను ఒక రోజు అనియు , చంద్రుడు భూమి చుట్టూ ఒక ప్రదక్షిణము చేయుటను ఒక నెల అనియు , భూమి సూర్యునిచుట్టు ఒక ప్రదక్షిణము చేయుటను ఒక సంవత్సరము అనియు ప్రపంచము లోని అన్ని దేశములవారు లెక్కించుచున్నారు . గ్రహములు సంచరించుచున్న మార్గమును మన పూర్వీకులు జ్యోతిశ్చక్రముగా ఊహ చేసి , దానిని 12 భాగములు (రాశులు ) గా భాగించినారు. ఒక్కొక్క భాగములో నున్న నక్షత్రముల రాశులకు ఒక్కొక్క పేరు పెట్టినారు. నక్షత్రములు మొత్తము 27 . ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగములు (పాదములు) ఊహించి అటువంటి నక్షత్ర భాగములను 9 ని ఒక రాశిగా నిర్దారించినారు. వాని రూపములను ఊహించి ఆ ప్రకారము రకరకముల పేర్లు పెట్టినారు. ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగముల వంతున 27 నక్షత్రములకు 108 భాగములకు 12 రాశులు అయినవి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుట వలన మనకు రోజుకొక నక్షత్ర మండలము నుండి కనపడుచున్నాడు . ఏ నక్షత్ర మండలములో చంద్రుడు మనకు కనబడు చున్నాడో ఆ నక్షత్రమును మన పంచాంగపు వ్యవహారములలో ఆనాటి నక్షత్రముగా పరిగణించుచున్నాము .


పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్ర మండలములో కనపడునో ఆ నక్షత్రము పేరు ఆ నెలగా వాడుచున్నాము. చిత్తా నక్షత్ర మండలములో చంద్రుడు పౌర్ణమినాడు కనపడు మాసమునకు చైత్రమాసము అని పేరు పెట్టబడినది. ఈ ప్రకారము విశాఖ - వైశాఖ , జ్యేష్ట -జ్యేష్టము , పూర్వాషాడ - ఆషాడము , శ్రవణము - శ్రావణము , ఉత్తరాభాద్ర - భాద్రపదము, అశ్వని - ఆశ్వయుజము, కృత్తిక - కార్తీకము , మృగశిర - మార్గశిరము, పుష్యమి - పుష్యము, మఖ - మాఘము, ఉత్తర ఫల్గుణి - పాల్గుణము అని మనము ఆ నెలలును పిలుచుచున్నాము .


పై అన్ని విషయములను గూర్చి తెలుపునది పంచాంగము. పంచాంగము ముఖ్యముగా మనకు 5 విషయములను తెలుపును. 1 . తిధి , 2 . వారము , 3 . నక్షత్రము , 4 . యోగము , 5 . కరణము .కనుకనే దానికి పంచాంగము అని పేరు వచ్చినది .

 
వర్జ్యం : ' వర్జింపుట ' అనగా వదలివేయుట అని అర్ధము. ప్రతి దినము కాలెండరు నందు చెప్పబడు రాహుకాల, దుర్ముహూర్త వర్జ్యాదులలో ఏ కార్యము తల పెట్టినను అది సంపూర్ణ ఫల మందించదు. కావున అట్టి సమయములలో ఏ శుభ కార్యమును ప్రారంబించరాదని ఆర్యుల అభిప్రాయము. మన ఆంధ్ర రాష్ట్రములో ఎక్కువగ పాడిలో నున్నది . వర్జ్యము ( దక్షినాది రాష్ట్రాల వారు రాహు కాలము, యమగండము వంటివి పాటించెదరు ). ప్రతి శని వారము సూర్యోదయంతో ప్రారంబమగునది దుర్ముహూర్తం . సూర్యోదయంతో మొదలయ్యే 5 ఘడియలు అనగా 1 గం . 40 ని .పాటు ఈ దుర్ముహూర్తముండును. కాన ఆ సమయమందును ఏ శుభ కార్యము తల పెట్ట రాదు. రాహు కాల యమగండ కాలములు నిత్యము నిర్దిష్ట సమయములలో ఉండును. అవి చూచుకొని ఆయా సమయములలో కాక మిగిలిన శుభ ఘడియలలో కార్యములు తల పెట్టిన అవి నిర్విఘ్నముగా నెరవేరును.
పంచాంగ విషయాలు:

తిధి, వార, నక్షత్ర వివరములతో గ్రహ గమనాలతో , శుభ దినములతో , పండుగలతో, శుభాశుభ ముహూర్తములతో సూర్యోదయ ,అస్తమయ సమయములతో, వర్జ్య , దుర్ముహూర్త సమయములతో ప్రతిరోజూ మీ ముందుండెడిదే ఈ పంచాంగము.

ఈ పంచాంగము నక్షత్రముల , రాశుల దిన ,వార , మాస ,సంవత్సరాల వారీ ఫలితాలతో,గ్రహ దోషాలు, వాటి నివారణలతో సామాన్యులకు కూడ అర్ధ మగు రీతిలో మీ కందించబడుతుంది . ఈ అనంత మైన విశ్వములో మనము నివసించు చున్న భూమీ ఒక గుండ్రని గోళము.అటువంటి గోళములో విశ్వములో లెక్కలేనన్ని ఉన్నవి మనకు పెద్దవిగా కనబడి ఎక్కువగా చలనము ఉన్న వాటిని గ్రహములని,చిన్నవాటిని నక్షత్రములని అనుచున్నాము. ఈ గ్రహములు ముఖ్యముగా తొమ్మిది . సూర్యుడు ,చంద్రుడు ,అంగారకుడు ,బుధుడు ,గురుడు ,శుక్రుడు ,శని , రాఃహుడు ,కేతువు . సూర్యుడు ప్రధాన గోళముగా ఈ గోళములన్నియు సూర్యునిచుట్టు తిరుగు చున్నవి. వీనిలో కొన్ని ఒక దాని చుట్టూ మరియొకటి తిరుగుచూ ,ఒక దానినొకటి ఆకర్షించు కొనుచున్నవి . ఉదా : భూమి తన చుట్టూ తాను తిరుగుచూ ,సూర్యుని చుట్టూ గూడా తిరుగు చున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగు చున్నాడు.
భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన సూర్యుని వెలుతురు ఒక భూభాగము నుండి మరియొక భూభాగమునకు మారుటచే రాత్రి , పగలు ఏర్పడుచున్నవి. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుగుటను ఒక రోజు అనియు , చంద్రుడు భూమి చుట్టూ ఒక ప్రదక్షిణము చేయుటను ఒక నెల అనియు , భూమి సూర్యునిచుట్టు ఒక ప్రదక్షిణము చేయుటను ఒక సంవత్సరము అనియు ప్రపంచము లోని అన్ని దేశములవారు లెక్కించుచున్నారు . గ్రహములు సంచరించుచున్న మార్గమును మన పూర్వీకులు జ్యోతిశ్చక్రముగా ఊహ చేసి , దానిని 12 భాగములు (రాశులు ) గా భాగించినారు. ఒక్కొక్క భాగములో నున్న నక్షత్రముల రాశులకు ఒక్కొక్క పేరు పెట్టినారు. నక్షత్రములు మొత్తము 27 . ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగములు (పాదములు) ఊహించి అటువంటి నక్షత్ర భాగములను 9 ని ఒక రాశిగా నిర్దారించినారు. వాని రూపములను ఊహించి ఆ ప్రకారము రకరకముల పేర్లు పెట్టినారు. ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగముల వంతున 27 నక్షత్రములకు 108 భాగములకు 12 రాశులు అయినవి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుట వలన మనకు రోజుకొక నక్షత్ర మండలము నుండి కనపడుచున్నాడు . ఏ నక్షత్ర మండలములో చంద్రుడు మనకు కనబడు చున్నాడో ఆ నక్షత్రమును మన పంచాంగపు వ్యవహారములలో ఆనాటి నక్షత్రముగా పరిగణించుచున్నాము .

పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్ర మండలములో కనపడునో ఆ నక్షత్రము పేరు ఆ నెలగా వాడుచున్నాము. చిత్తా నక్షత్ర మండలములో చంద్రుడు పౌర్ణమినాడు కనపడు మాసమునకు చైత్రమాసము అని పేరు పెట్టబడినది. ఈ ప్రకారము విశాఖ - వైశాఖ , జ్యేష్ట -జ్యేష్టము , పూర్వాషాడ - ఆషాడము , శ్రవణము - శ్రావణము , ఉత్తరాభాద్ర - భాద్రపదము, అశ్వని - ఆశ్వయుజము, కృత్తిక - కార్తీకము , మృగశిర - మార్గశిరము, పుష్యమి - పుష్యము, మఖ - మాఘము, ఉత్తర ఫల్గుణి - పాల్గుణము అని మనము ఆ నెలలును పిలుచుచున్నాము .

పై అన్ని విషయములను గూర్చి తెలుపునది పంచాంగము. పంచాంగము ముఖ్యముగా మనకు 5 విషయములను తెలుపును. 1 . తిధి , 2 . వారము , 3 . నక్షత్రము , 4 . యోగము , 5 . కరణము .కనుకనే దానికి పంచాంగము అని పేరు వచ్చినది .

వర్జ్యం : ' వర్జింపుట ' అనగా వదలివేయుట అని అర్ధము. ప్రతి దినము కాలెండరు నందు చెప్పబడు రాహుకాల, దుర్ముహూర్త వర్జ్యాదులలో ఏ కార్యము తల పెట్టినను అది సంపూర్ణ ఫల మందించదు. కావున అట్టి సమయములలో ఏ శుభ కార్యమును ప్రారంబించరాదని ఆర్యుల అభిప్రాయము. మన ఆంధ్ర రాష్ట్రములో ఎక్కువగ పాడిలో నున్నది . వర్జ్యము ( దక్షినాది రాష్ట్రాల వారు రాహు కాలము, యమగండము వంటివి పాటించెదరు ). ప్రతి శని వారము సూర్యోదయంతో ప్రారంబమగునది దుర్ముహూర్తం . సూర్యోదయంతో మొదలయ్యే 5 ఘడియలు అనగా 1 గం . 40 ని .పాటు ఈ దుర్ముహూర్తముండును. కాన ఆ సమయమందును ఏ శుభ కార్యము తల పెట్ట రాదు. రాహు కాల యమగండ కాలములు నిత్యము నిర్దిష్ట సమయములలో ఉండును. అవి చూచుకొని ఆయా సమయములలో కాక మిగిలిన శుభ ఘడియలలో కార్యములు తల పెట్టిన అవి నిర్విఘ్నముగా నెరవేరును.

No comments:

Post a Comment