22 September 2015

గ్రహదోష పరిహారములు :-

ఒక గృహస్తు కుటుంబమందు అనేక కష్టములు అనుభవించుట వల్ల తన జాతక పరిశీలనకు జోస్యుని వద్దకు వెళితే ఆతను గ్రహానునుకూలం లేదు నవగ్రహ హోమము చేసుకోవలెను మరియు మాతృ దోషం, పితృ దోషం, బ్రాహ్మణ శాపం, గో శాపం, సుమంగళి శాపం జాతకములో వుంది. దీనికి పరిహారము చేసుకొంటే కష్ట నివారణ కలుగుతుందని విన్న వించెను. గృహస్తుకు ఏమి పాలుపోకుండా పరమాచార్యుల ఆశీస్సులకు గాను వెళ్లి తన కష్టములను వినిపించి జోస్యుడు చెప్పిన పరిహారాదులను చెప్పి ఒక మార్గము ఉపదేసించాలని కోరితే ఆచార్యులు జోస్యుడు చెప్పిన పరిహారాదులు చేసుకొంటే మంచి జరగకున్నా చెడుపు మట్టుకు జరుగదు అని అన్నారు.

ఇతనికి పరిహారాదులు చేసేదా వద్దా అనే సమస్య అర్థము కాకుండా మరలా అడిగేలోపు ఆచార్యులు వెళ్ళిపోయిరి. గృహస్తు తనకు ఏమియు అర్థము కాలేదని చింతించుచుండడం చూసి ఆచార్యులు అతనికి కొన్ని వివరణములు చెప్పిరి అవి :

1. ప్రతి ఒక్కరికి నిర్దేసింపబడిన కార్యములు కలవు దానిని విస్మరించ కూడదు. ఇతనికి తండ్రి తల్లి కాక తాత నాన్నమ్మ బ్రతికి ఉన్నారు వారిని సక్రమముగా వృద్ధాప్యమందు పోషించడం ప్రథమ కర్తవ్యమ్.
2. ఇంటికి వచ్చిన ఆర్థులకు తన శక్త్యానుసారం బిక్షం వేసి పంపవలెను మారుగా వారిని విమర్శించడం అవమానించడం చేయడం తగదు.
3. దాహార్తిగా వచ్చిన వారికి మంచి నీరు ఇవ్వవలెను.
4. బీదలను, వంట చేయడానికి వచ్చిన వారిని పని వారలను నిందించకుండా ప్రియముగా పలుకవలెను.
5. వాకిలి వద్దకు వచ్చిని గోవుకు నీరు లేక అరటి పండో ఇచ్చి దాని గొంతు భాగము తడిమి విడవ వలెను.
6. తన వంశమందు సుమంగళిగా మరణించిన వారి ప్రీతి ఆశీస్సులకు గాను బీద సుమంగళి స్త్రీలకూ వర్షమునకు ఒక పర్యాయము గృహమునకు ఆహ్వానించి భోజనాదులు ఇచ్చి వారికి చీర రవిక మాంగల్య వస్తువులు అంటే కాటుక అద్దం గాజులు పసుపు కుంకుమ పెట్టి గౌరవించ వలెను.

ఇవి అన్ని గృహస్తుగా చేస్తే తనకు యే కుటుంబ కష్టములు వుండవు మరియు శాపాదులు తగలవు హాయిగా జీవించ వచ్చు అని విడమరిచి చెప్పిరి. ఇప్పుడు గృహస్తు తన తప్పిదం ఏమి అనేది అర్థం అయ్యి పెద్దలకు సాష్టాంగ నమస్కారములు సమర్పించుకొని తన తప్పులు ఒప్పుకొని ఇకపై తానూ తప్పు చేయనని ఒప్పుకొని ఆశీస్సులు పొంది చెప్పిన వాటిని అనుసరించి బాగుపడెను.

ఇవి అన్ని మనము చేయవలసిన అవశ్య కృత్యములు దానిని విస్మరించితే అన్ని కష్టములే మరి మనము మనలను మార్చుకొంటే మనకు అన్ని సుఖములే కలుగుతుంది.

No comments:

Post a Comment