10 December 2014

ఆంజనేయ స్వామి :-

ఆంజనేయ స్వామిని కొలిచే వారికి సకల దోషాలు పరిష్కారమవుతాయని పండితులు అంటున్నారు. శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ప్రతి శనివారం తొమ్మిది సార్లు ఆంజనేయ స్వామిని ప్రదక్షణలు చేస్తేనే ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాంటి ఆంజనేయస్వామికి తమలపాకుల మాల, వెన్నంటే ప్రీతికరం. ఇంకా అభిషేకం అంటే ఈ వాయు కుమారునికి ఇష్టమెక్కువ. అందుచేత మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయం కావాలంటే.. ఆంజనేయ స్వామిని రామమంత్రముతో పూజిస్తే సరిపోతుంది.

అభిషేకాలతో ఆ బహుబలిని పూజించాలనుకుంటున్నారా.. అయితే ఆంజనేయునికి ఏయే అభిషేకాలు చేస్తే ఏ ఫలితముంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా... ఇంకా చదవండి.

తేనె - తేజస్సువృధ్ధి చెందుతుంది
ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి.
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి చేకూరుతుంది.
ఆవునెయ్యి -ఐశ్వర్యం
విబూధితో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి.

గరికనీటితో - పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహనాదులను తిరిగి పొందగలుగుతారు.
అన్నంతో అభిషేకంతో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.
నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసంతో - చర్మ వ్యాధులు నశిస్తాయి.
పసుపునీటితో - సకలశుభాలు, సౌభాగ్యదాయకం
నువ్వులనూనెతో అభిషేకిస్తే - అపమృత్యు నివారణ.
సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం
ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు.


No comments:

Post a Comment